Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా, ఆమెకు ‘కుడి భుజం’గా పేరుగాంచిన సువేందు అధికారి.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో బీజేపీ (BJP) తరపున బెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం మొదలైంది. బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి (R.N. Ravi) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దాదాపు కేంద్ర మంత్రిమండలి హాజరైంది.
ముఖ్యంగా, మమతా బెనర్జీ ధరించే సాదాసీదా తెల్లచీర, రబ్బరు చెప్పుల తరహాలోనే.. సువేందు సైతం అత్యంత నిరాడంబరంగా కాషాయ రంగు కుర్తా ధరించి ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. ఆయనతో పాటు అగ్నిమిత్ర పాల్, నిసిత్ ప్రామాణిక్, దిలీప్ ఘోష్, శంకర్ ఘోష్లు సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ విజయం బీజేపీకి ఎంత కీలకమో చాటిచెప్పేలా, ప్రధానితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలం కావడంతో బెంగాల్ గడ్డపై అధికారం చేపట్టడాన్ని ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
Also Read
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
ఈ వేడుక కోసం బీజేపీ మే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉంది. ఆ రోజు నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (రవీంద్ర జయంతి). బీజేపీని ‘ఉత్తర భారత పార్టీ’ అని, బెంగాలీ సంస్కృతిని గౌరవించదని టీఎంసీ చేసే ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఈ తేదీని నిర్ణయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, సభా ప్రాంగణం విషయానికి వస్తే.. బెంగాలీ సంస్కృతికి అద్దం పట్టేలా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో వినూత్న ఏర్పాట్లు చేశారు. వేదిక వద్ద దాదాపు 20 స్వీట్ల స్టాళ్లతో పాటు, బెంగాల్ ప్రత్యేకం అయిన ‘ఝల్మురీ’ (మరమరాల మిశ్రమం) స్టాళ్లను సైతం ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్లో ఝర్గ్రామ్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ అనూహ్యంగా ఆగి ఈ ఝల్మురీని రుచి చూడటంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.
తాజావార్తలు
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!