NTV Telugu Site icon

Manipur: మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై మిలిటెంట్లు మెరుపుదాడి.. పలు రౌండ్ల కాల్పులు

Manipur

Manipur

Manipur voilence: మణిపుర్ సీఎం ఎన్​ బిరేన్​ సింగ్​ ముందస్తు భద్రతా కాన్వాయ్​ పై ఇవాళ (సోమవారం) మెరుపు దాడి చేశారు. భద్రతా కాన్వాయ్​ వాహనాలపై పలుమార్లు తుఫాకీతో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఓ భద్రతా సిబ్బందికి బుల్లెట్​ గాయాలు అయినట్లు పేర్కొన్నారు. సీఎం ముందస్తు కాన్వాయ్​ సమస్యాత్మక ప్రాంతమైన జిరిబామ్ జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాంగ్​పోక్పి జిల్లాలో జరిగినట్లు చెప్పుకొచ్చారు.

Read Also: AP Cabinet: ఏపీలో మంత్రివవర్గం పై చంద్రబాబు కసరత్తు.. పవన్ కళ్యాణ్ కి ఏ సీటు ఇవ్వబోతున్నారు..?

కాగా, జిరిబామ్​ ప్రాంతంలో రెండు పోలీస్ ఔట్ పోస్టులు, ఒక ఫారెస్ట్​ బీట్​ అధికారి ఆఫీసుతో పాటు దాదాపు 70 ఇళ్లను గత శనివారం గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) ఢిల్లీ నుంచి ఇంఫాల్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, జిరిబామ్ ను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రణాళిక రెడీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిరిబామ్ కు బయలుదేరిన సీఎం బీరేన్ సింగ్ ముందస్తు కాన్వాయ్ పై ఈ దాడి జరిగింది.