Joshimath: జోషిమఠ్ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. 16న సుప్రీం విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joshimath: ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను జనవరి 16న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జోషిమఠ్లో భూమి క్షీణించడం వల్ల పెను సవాలు ఎదురవుతోంది. ముఖ్యమైనవన్నీ నేరుగా తమ వద్దకు రాకూడదని, అత్యవసర విచారణ కోసం స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి దాఖలు చేసిన పిటిషన్ను జాబితా చేయడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. దీనిని పరిశీలించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సంస్థలు ఉన్నాయని.. . ముఖ్యమైనవన్నీ తన వద్దకు నేరుగా రాకూడదని, జనవరి 16న జాబితా చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
అవిముక్తేశ్వరానంద సరస్వతి తరఫు న్యాయవాది పరమేశ్వర్ నాథ్ మిశ్రా ఈ పిటిషన్ను ప్రస్తావించారు. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ కారణంగానే ఈ సంఘటన జరిగిందని, ఉత్తరాఖండ్ ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించాలని పిటిషనర్ వాదించారు. ఈ సమయంలో జోషిమఠ్ నివాసితులకు మద్దతు ఇవ్వడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి దిశానిర్దేశం చేయాలని కూడా పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.
Also Read
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! 'క్లబ్లోకి స్వాగతం' అంటూ..
Omar Abdullah: కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు.. ఎన్నికల కోసం అడుక్కోరు
మానవ జీవితాన్ని, పర్యావరణ వ్యవస్థను పణంగా పెట్టే ఎటువంటి అభివృద్ధి అవసరం లేదు. అలాంటిది ఏదైనా జరగాలంటే, దానిని యుద్ధప్రాతిపదికన వెంటనే ఆపడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కర్తవ్యమని వాదించారు. బద్రీనాథ్, హేమ్కుండ్ సాహిబ్, ఔలి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారం అయిన జోషిమఠ్.. భూమి క్షీణత కారణంగా పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. అక్కడ ఇళ్లు, రోడ్లు, పొలాల్లో భారీ పగుళ్లు ఏర్పడటంతో జోషిమఠ్ క్రమంగా మునిగిపోతోంది. చాలా ఇళ్లు కూలిపోయాయని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న 600 కుటుంబాలను తక్షణమే ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
-
Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!