SRH vs RR: రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్స్.. సన్రైజర్స్ భారీ స్కోర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. రెండు జట్లు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేతిలో ఉంది. హైదరాబాద్ పగ్గాలు పాట్ కమ్మిన్స్ చేతిలో ఉన్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. బారిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ రెచ్చిపోయింది. 14 ఓవర్లలోనే 200 స్కోర్ పూర్తి చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాలంటే 287 పరుగులు సాధించాల్సి ఉంది. ఇద్దరు కీలక ప్లేయర్లు ఈ మ్యాచ్లో రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ 45 బాల్స్లో సెంచరీ పూర్తి చేశాడు. చివరి బాల్ వరకు ఆడిన ఇషాన్ కిషన్ (106) బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రావిస్ హెడ్(67) మెరుపు వేగంతో ఆడాడు. క్లాసెన్(34), తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ(24) పరుగులు సాధించారు.
READ MORE: Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 50,000 దాటిన మరణాల సంఖ్య..
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా క్రీజులోకి దిగారు. మొదట్లోనే విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మహీష్ తీక్షణ బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు. యశస్వి జైస్వాల్ క్యాచ్ పట్టడంతో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు. వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అనంతరం ట్రావిస్ హెడ్ దంచి కొట్టాడు. 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో హిట్ మేయర్కు క్యాచ్ ఇచ్చిన ట్రావిస్ హెడ్ (67).. పెవిలియన్కు చేరుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(30).. మహీష తీక్షణ బౌలింగ్లో జైశ్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నితీశ్, ఇషాన్ కిషన్ 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో హెన్రిచ్ క్లాసెన్ బరిలోకి క్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్లాసెన్(34) వీర బాదుడు బాదాడు. సందీప్ శర్మ బౌలింగ్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (34) వెనుదిరిగాడు. క్రీజ్లోకి వచ్చిన అంకిత్ వర్మ, అభివనవ్ మనోహర్ తుషార్ దేశ్పాండే బౌలింగ్లో వెంట వెంటనే ఔట్ అయ్యారు. మరోవైపు తుషార్ దేశ్పాండే(3), మహీష తీక్షణ(2), సందీప్ శర్మ(1) చోప్పున వికెట్లు తీశారు.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!