Khyber Pakhtunkhwa: పాకిస్తాన్ లో పోలీసు వ్యాన్ పై ఆత్మాహుతి దాడి.. ఇద్దరు పోలీసులు మృతి
- పాకిస్తాన్ లో పోలీసు వ్యాన్ పై ఆత్మాహుతి దాడి
- ఇద్దరు పోలీసులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ భయాందోళనలో ఉంది. రెండు రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్ దాడి నుంచి తేరుకోక ముందే పాక్ లో పోలీస్ వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పెషావర్లోని చమ్కానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్లోని పశువుల మార్కెట్ సమీపంలో పోలీసు మొబైల్ వ్యాన్పై ఆత్మాహుతి దాడి జరిగిందని ఎస్ఎస్పి మసూద్ బంగాష్ తెలిపారు.
Also Read:Gold Rates: గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రూ. 1800 తగ్గిన తులం గోల్డ్ ధర
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ ఈ దాడిని ఖండించారు. సంఘటనపై వివరణాత్మక నివేదికను కోరారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా భారత్ ఏప్రిల్ 7న పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించి వైమానిక దాడులు చేయడంతో దాయాది దేశానికి పెద్ద దెబ్బ తగిలింది.
Also Read:Rajinikanth : హీరోయిన్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకున్న రజినీకాంత్..
భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని అనేక ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్లోని దాదాపు 11 వైమానిక స్థావరాలపై భారతదేశం విజయవంతంగా దాడి చేసింది. దీని తరువాత, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత DGMO కి ఫోన్ చేశారు. పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించింది. దీని తరువాత, కొన్ని షరతులతో పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను భారతదేశం అంగీకరించింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!