Sugavasi Subramanyam: నేడు వైసీపీలో చేరనున్న సీనియర్ నేత.. రాజకీయంగా టీడీపీకి దెబ్బే!
- నేడు వైసీపీలో చేరనున్న సుగవాసి బాలసుబ్రమణ్యం
- వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి సుగవాసి
- సుగవాసి పార్టీని వీడడం రాజకీయంగా టీడీపీకి దెబ్బే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో.. వైసీపీకి మరింత బలం చేకూరనుంది. బాలసుబ్రమణ్యం పార్టీని వీడడం రాజకీయంగా టీడీపీకి దెబ్బే అనే చెప్పాలి.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడే బాలసుబ్రమణ్యం. సుగవాసి కుటుంబం నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే బాలసుబ్రమణ్యం టీడీపీకి బై బై చెప్పారు. ఇటీవలి పరిణామాలు తమను టీవీరంగా బాధించాయంటూ పార్టీకి రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ.. తనకు ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తిలో ఉన్నారు. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రాజుకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు తండ్రి పాలకొండ్రాయుడు చనిపోతే.. కనీసం టీడీపీ పార్టీ తరపున ఒక్కరు కూడా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాకపోవడం ఆయన్ను బాగా హర్ట్ చేసింది.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో కొనసాగడం ఇష్టం లేని సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2024 ఎన్నికల్లో బాలసుబ్రమణ్యం టీడీపీ తరపున రాజంపేట నుంచి పోటీ చేసి.. వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. సుగవాసి రాజకీయ వారసుడిగా బాలసుబ్రమణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ముందుగా రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 2001లో మరోసారి జడ్పీటీసీగా విజయం సాధించారు. 2012లో రాయచోటి ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
- Tags
- ap
- Sugavasi Subramanyam
- tdp
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
-
DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
-
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!