Indian Dams : నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతున్న భారతీయ డ్యామ్లు.. ఆందోళనలో నిపుణులు
Indian Dams : జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి. భూమి వేడి ద్రవాలతో నిండిన గ్రహం. ప్రతి సెకనుకు భౌగోళిక మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పు పరిణామాలపై యూఎన్ యూనివర్సిటీ దర్యాప్తు చేస్తోంది. 2050 నాటికి, భారతదేశం అంతటా 3,700 పెద్ద ఆనకట్టల వద్ద సిల్ట్(పూడిక) పేరుకుపోవడం వల్ల అవి గతంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యంలో 26% వరకు కోల్పోయే అవకాశం ఉంది. UN యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఇటీవల చేసిన పరిశోధన ప్రకారం 2050వరకు ప్రపంచ ఆనకట్ట నిల్వ సామర్థ్యం 25% తగ్గవచ్చని తెలిపింది.
UN సుమారు 150 దేశాల్లోని 47,000 కంటే ఎక్కువ ఆనకట్టలపై డేటాను సేకరించింది. గతంలో సంభవించిన, సంభవిస్తున్న మార్పులను విశ్లేషించింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా చాలా డ్యామ్లు ఇప్పటికే వాటి అసలు సామర్థ్యంలో 16 శాతం కోల్పోయాయి. 2050 నాటికి డ్యామ్ల నిల్వ సామర్థ్యం దాదాపు 25 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. 2050 నాటికి భారత్లాగే అమెరికా తన సామర్థ్యంలో 34 శాతం, బ్రెజిల్ 23 శాతం, చైనా 20 శాతం నష్టపోతాయని అంచనా వేసింది. కెపాసిటీ తగ్గడానికి అనేక కారణాలున్నప్పటికీ, 50,000 పెద్ద డ్యామ్లు ఇప్పటికే 13 శాతం నుంచి 19 శాతం వరకు పూడిక కారణంగా నిరుపయోగంగా ఉన్నట్లు సమాచారం.
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
Read Also: Best Companies In US: పని చేసేందుకు ఫర్ఫెక్ట్ కంపెనీలు ఇవే
యునైటెడ్ కింగ్డమ్, పనామా, ఐర్లాండ్, జపాన్, సీషెల్స్ 2050 నాటికి వాటి అసలు సామర్థ్యాల్లో 35 శాతం నుండి 50 శాతం వరకు నీటి నిల్వ నష్టానికి కలిగి ఉంటాయని అధ్యయనం తేల్చింది. భూటాన్, కంబోడియా, ఇథియోపియా, గినియా, నైజర్ ఐదు తక్కువ ప్రభావిత దేశాలు…ఈ శతాబ్దం మధ్య నాటికి 15 శాతం కంటే తక్కువగా ప్రభావితమవుతాయని పేర్కొంది.
నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి , నీటి సరఫరాతో సహా జాతీయ ఆర్థిక వ్యవస్థలోని అనేక అంశాలు ప్రభావితమవుతాయి. నిర్మాణంలో ఉన్న లేదా ప్రణాళికలో ఉన్న కొత్త ఆనకట్టల్లో పూడిక పేరుకోవడంతో గతంలో ఉన్నట్లు నిల్వను భర్తీ చేయలేవు. ఇది పేపర్ గ్లోబల్ వాటర్ ఛాలెంజ్కు హెచ్చరికగా అనిపిస్తుందని డాక్టర్ దుమిందా పెరెరా ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also: Health News: చలి అని ముసుగు తన్ని పడుకుంటే.. మీకు మూడినట్లే..?
భారతదేశ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకారం .. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన 141 పెద్ద రిజర్వాయర్లలో 25% ఇప్పటికే వాటి అసలు నిల్వ సామర్థ్యంలో కనీసం 30% కోల్పోయాయి. 42 వేర్వేరు యూరోపియన్ దేశాలలోని 6,651 పెద్ద ఆనకట్టల ప్రారంభ నిల్వ సామర్థ్యం 895 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంటే ఆ పరిమాణంలో 19% కోల్పోయింది. 2030 నాటికి 21%, 2050 నాటికి 28% వరకు కోల్పోనున్నట్లు భారతదేశ సెంట్రల్ వాటర్ కమిషన్ 2015 విశ్లేషణలో పేర్కొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?