Indian Dams : నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతున్న భారతీయ డ్యామ్లు.. ఆందోళనలో నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Dams : జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి. భూమి వేడి ద్రవాలతో నిండిన గ్రహం. ప్రతి సెకనుకు భౌగోళిక మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పు పరిణామాలపై యూఎన్ యూనివర్సిటీ దర్యాప్తు చేస్తోంది. 2050 నాటికి, భారతదేశం అంతటా 3,700 పెద్ద ఆనకట్టల వద్ద సిల్ట్(పూడిక) పేరుకుపోవడం వల్ల అవి గతంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యంలో 26% వరకు కోల్పోయే అవకాశం ఉంది. UN యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఇటీవల చేసిన పరిశోధన ప్రకారం 2050వరకు ప్రపంచ ఆనకట్ట నిల్వ సామర్థ్యం 25% తగ్గవచ్చని తెలిపింది.
UN సుమారు 150 దేశాల్లోని 47,000 కంటే ఎక్కువ ఆనకట్టలపై డేటాను సేకరించింది. గతంలో సంభవించిన, సంభవిస్తున్న మార్పులను విశ్లేషించింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా చాలా డ్యామ్లు ఇప్పటికే వాటి అసలు సామర్థ్యంలో 16 శాతం కోల్పోయాయి. 2050 నాటికి డ్యామ్ల నిల్వ సామర్థ్యం దాదాపు 25 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. 2050 నాటికి భారత్లాగే అమెరికా తన సామర్థ్యంలో 34 శాతం, బ్రెజిల్ 23 శాతం, చైనా 20 శాతం నష్టపోతాయని అంచనా వేసింది. కెపాసిటీ తగ్గడానికి అనేక కారణాలున్నప్పటికీ, 50,000 పెద్ద డ్యామ్లు ఇప్పటికే 13 శాతం నుంచి 19 శాతం వరకు పూడిక కారణంగా నిరుపయోగంగా ఉన్నట్లు సమాచారం.
Also Read
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
Read Also: Best Companies In US: పని చేసేందుకు ఫర్ఫెక్ట్ కంపెనీలు ఇవే
యునైటెడ్ కింగ్డమ్, పనామా, ఐర్లాండ్, జపాన్, సీషెల్స్ 2050 నాటికి వాటి అసలు సామర్థ్యాల్లో 35 శాతం నుండి 50 శాతం వరకు నీటి నిల్వ నష్టానికి కలిగి ఉంటాయని అధ్యయనం తేల్చింది. భూటాన్, కంబోడియా, ఇథియోపియా, గినియా, నైజర్ ఐదు తక్కువ ప్రభావిత దేశాలు…ఈ శతాబ్దం మధ్య నాటికి 15 శాతం కంటే తక్కువగా ప్రభావితమవుతాయని పేర్కొంది.
నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి , నీటి సరఫరాతో సహా జాతీయ ఆర్థిక వ్యవస్థలోని అనేక అంశాలు ప్రభావితమవుతాయి. నిర్మాణంలో ఉన్న లేదా ప్రణాళికలో ఉన్న కొత్త ఆనకట్టల్లో పూడిక పేరుకోవడంతో గతంలో ఉన్నట్లు నిల్వను భర్తీ చేయలేవు. ఇది పేపర్ గ్లోబల్ వాటర్ ఛాలెంజ్కు హెచ్చరికగా అనిపిస్తుందని డాక్టర్ దుమిందా పెరెరా ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also: Health News: చలి అని ముసుగు తన్ని పడుకుంటే.. మీకు మూడినట్లే..?
భారతదేశ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకారం .. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన 141 పెద్ద రిజర్వాయర్లలో 25% ఇప్పటికే వాటి అసలు నిల్వ సామర్థ్యంలో కనీసం 30% కోల్పోయాయి. 42 వేర్వేరు యూరోపియన్ దేశాలలోని 6,651 పెద్ద ఆనకట్టల ప్రారంభ నిల్వ సామర్థ్యం 895 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంటే ఆ పరిమాణంలో 19% కోల్పోయింది. 2030 నాటికి 21%, 2050 నాటికి 28% వరకు కోల్పోనున్నట్లు భారతదేశ సెంట్రల్ వాటర్ కమిషన్ 2015 విశ్లేషణలో పేర్కొంది.
తాజావార్తలు
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!