Suryapet: ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. బైపిసి రెండవ సంవత్సరం చదువుతున్న వైష్ణవి నిన్న రాత్రి డార్మెటరీ హాల్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కాలేజీలో ఫేర్వెల్ పార్టీ పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిలు, ఉపాధ్యాయులు అందరూ కాలేజీలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది. డార్మెటరీ హాల్ కు వెళ్లిన వైష్ణవి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సహా విద్యార్థులు వెళ్లి చూడగా అప్పటికే వైష్ణవి ఫ్యాన్ కు ఉరి వేసుకోగా.. గమనించిన విద్యార్థులు రక్షించే ప్రయత్నం చేశారు. వైష్ణవి కొన ఊపిరితో ఉండడంతో 108 సహాయంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Read also: Haldwani violence : హల్ద్వానీ హింసకు సూత్రధారి కోసం ఢిల్లీ-యుపిలో పోలీసుల సెర్చింగ్
కానీ అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు… తన కూతురు ఆత్మహత్యకు కళాశాల అధ్యాపకులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో వైష్ణవి ఉపాధ్యాయులను ప్రశ్నించిందని దాన్ని మనసులో పెట్టుకున్న స్కూల్ ఉపాధ్యాయులు వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులు చదువుతుందని భావించిన తల్లిదండ్రులకు వైష్ణవి విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.. ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Haldwani violence : హల్ద్వానీ హింసకు సూత్రధారి కోసం ఢిల్లీ-యుపిలో పోలీసుల సెర్చింగ్