RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. నోటీసు ఇచ్చిన కార్మిక జేఏసీ
- తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
- ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం..
- సమ్మెకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు
- సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక జేఏసీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక జేఏసీ నోటీసు ఇచ్చింది. బస్ భవన్లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. 21 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందించారు ఆర్టీసీ యూనియన్ నేతలు. తమ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల (ఫిబ్రవరి 9) సమ్మె బాట పడతామని కార్మిక జేఏసీ తెలిపింది. గతంలో ప్రభుత్వం హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీస్లో తెలిపింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భారీ ఎత్తున బస్ భవన్ వద్దకు రావడంతో పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు.
Read Also: Rahul Gandhi: రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర.. కాంగ్రెస్ కాపాడింది..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 14 నెలలైన ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు వెంటనే చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేశారు. వీటిని నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు నోటీసుల్లో పేర్కొన్నాయి. మరోవైపు.. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతుందని జేఏసీ నేతలు ఆరోపించారు. ప్రైవేటు కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం, 2021 పీఆర్సీ, 2017 వేతన పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కారం కాలేదని జేఏసీ నేతలు ప్రధానంగా ఆరోపించారు. కాగా.. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలంటూ ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ గతంలోనే నిర్ణయించింది.
Read Also: Hanumakonda: రోడ్డు ప్రమాదం.. 20 మంది కూలీలకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గలకు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!