Site icon NTV Telugu

Afghanistan: దారుణం.. పట్టెడన్నం పెట్టలేక బిడ్డలకు నిద్రమాత్రలిస్తున్న తల్లిదండ్రులు

Afganistan

Afganistan

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‎లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. చేసేందుకు పనిలేక, వేరే దేశాలకు వలస వెళ్లలేక పశ్చిమ ఆఫ్ఘాన్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ ను స్వాధీన పరుచుకున్న దగ్గర్నుంచి అక్కడ తాలిబన్ల ప్రభుత్వం నడుస్తోంది. చిన్నారులకు ఆహారం ఇవ్వలేని చాలా కుటుంబాలు వారికి స్లీపింగ్‌ పిల్స్‌ ఇచ్చి నిద్రపుచ్చుతున్నాయి. మరికొన్ని కుటుంబాలు అయితే తమ ఆడపిల్లల్ని, కిడ్నీలను అమ్ముకుంటున్నారు. ఏడాది క్రితం ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ ఒక్క విదేశీ సాయం అందడం లేదు. ఒక్కపూట భోజనం కూడా చేయలేని అధ్వాన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.

Read Also: Coins In Stomach: ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్.. కడుపా లేదా కిడ్డీ బ్యాంకా ?

ఏఎఫ్‌పీ నివేదిక ప్రకారం, ఆకలి నుంచి కుటుంబసభ్యులను బయటపడేసేందుకు తల్లిదండ్రులు వారి కుమార్తెలను రూ.2-2.5 లక్షలకు అమ్ముకుంటున్నారు. తన ఐదేండ్ల కూతురిని రూ.90 వేలకు బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందని స్థానికుడు నిజాముద్దీన్ తెలిపాడు. చాలా ప్రాంతాల్లో కిడ్నీలు అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నారని హెరాత్‌ క్యాంపులో ఉంటున్న నిరుపేద కుటుంబాలకు ఆహారం అందజేస్తున్న అబ్దుల్‌ రహీం అక్బర్‌ విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ పరిస్థితి ఎంత మాత్రమూ ప్రభుత్వ సమస్య కాదని తాలిబాన్‌ ప్రతినిధి ఒకరు స్పష్టం చేయడం వారి ప్రభుత్వ విధానాలకు నిదర్శనంగా చెప్పవచ్చు.

Exit mobile version