NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : మూడు రోజుల పాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్

Sridhar Babu

Sridhar Babu

దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. సదస్సుకు జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి టెలికాం కంపెనీలు హాజరయ్యాయని, దాదాపు 33 దేశాల కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు, వివిధ దేశాల నుంచి బహుళ జాతి సంస్థల ప్రతినిధులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రారంభించారని, అనేక టెలికాం కంపెనీలకు సంబంధించిన సంస్థల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమావేశమై చర్చించామన్నారు. నిన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తో ప్రత్యేకంగా టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని రాష్ట్రాలకు నిర్ణయం చేయొచ్చని పాలసీ నిర్ణయం చేయడం హర్షణీయమన్నారు. తెలంగాణ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తెలియజేయడం జరిగిందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

Bigg Boss: బిగ్ బాస్ ఇంట్లోకి వరద.. కంటెస్టెంట్స్ ని ఏం చేస్తారు?

మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రో యాక్టివ్ గా తీసుకొని విధానపర నిర్ణయం తీసుకొని పాలసీని ఇనిషియేట్ చేస్తామని, దీనివల్ల అనేక టెలికాం మ్యానుఫ్యాక్చరర్స్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అతి త్వరలో దాన్ని తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేకించి ఐటీ మినిస్టర్ల సమావేశం కూడా జరిగిందని, జ్యోతి రాధిక సింగ్ , పెమ్మసాని చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో ఐటీ మినిస్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందన్నారు. ప్రభుత్వం తరఫున టీ ఫైబర్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ సంబంధించి గ్రామానికి ప్రతి ఇంటికి నెట్వర్క్ సదుపాయం కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వివరించామన్నారు 2013లో మొదలు పెట్టినటువంటి ఈ అంశం 2014 తర్వాత భారత నెట్ అని ఫేస్ టు ఫేస్ వన్ అని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమని, 3000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసుకొని అండర్ గ్రౌండ్ లో ఫైబర్ నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Tollywood: తెలుగు స్టార్ హీరోల సినిమాల లైనప్ ఇదే

అండర్ గ్రౌండ్ నుంచి నెట్వర్క్ ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత అని, నెట్వర్క్ పూర్తిస్థాయిలో కంప్లీట్ కావాలంటే నిధులు అవసరం… మాకు ఉన్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళామన్నారు. దాదాపు 1600 కోట్లకు పైగా అవసరమని, వెంటనే వాటిని తెలంగాణా కు కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకొచ్చారని, అటవీ ప్రాంతాలకు సంబంధించి ఫైబర్ నెట్వర్క్ కోసం అటవీ శాఖా అనుమతులు రావాల్సి ఉందని శ్రీధర్‌ బాబు వెల్లడించారు. అనుమతుల అంశాన్ని కేంద్రం పరిష్కారం చేయాలని కోరడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం కోరిన అంశాలను కేంద్రం సమీచేసి పరిష్కారం ఇచ్చే దిశగా చూస్తామని స్పష్టం చేశారని శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. ఎన్నో దేశ విధాల విదేశాలకు సంబంధించిన టెలికాం సంస్థలు ఉన్నాయి ప్రభుత్వం తరఫున వాళ్లను ప్రత్యేకంగా కొరటం జరిగిందని, ఇండస్ట్రీల ప్రోత్సాహానికి తెలంగాణలో ప్రత్యేకంగా వాతావరణం సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరామని, స్టెర్లైట్ అనే కంపెనీ తో ఎంవోయు కుదుర్చుకున్నామని తెలిపారు శ్రీధర్‌బాబు.