టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ కు బ్రేక్ పడింది. గతేడాది #Single చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ కుర్ర హీరోకు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి.
Also Read : Bollywood : కియారా అద్వానీ ఆఫర్స్కు అనీత్ పద్దా గండి
ఫిబ్రవరి చివరి వారంలో విడుదలైన ‘విష్ణు విన్యాసం’ చిత్రం శ్రీవిష్ణు మార్క్ కామెడీతో ఆకట్టుకుంటుందని భావించినప్పటికీ, కనీస ఓపెనింగ్స్ రాబట్టడంలో విఫలమైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో వీకెండ్లోనే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ, బలహీనమైన కథా కథనాల వల్ల ప్రేక్షకులు ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. డిస్టిబ్యూటర్స్ కు ఈ సినిమా నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక మార్చి మొదటి వారంలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ పరిస్థితి మరోలా ఉంది. ఈ సినిమాకు ఆరంభంలో మంచి రివ్యూలు, మౌత్ టాక్ లభించాయి. వీకెండ్లో వసూళ్లు పుంజుకుంటాయని భావిస్తున్న తరుణంలో, ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సినిమాకు శాపంగా మారింది. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా టీవీలకే పరిమితమయ్యారు. దీంతో ఆదివారం నాటి వసూళ్లు భారీగా దెబ్బతిన్నాయి. సోమవారం నాటికి సినిమా కోలుకుంటుందని ఆశించినా, అప్పటికే కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. దీంతో వరుసగా రెండు చిత్రాలు శ్రీవిష్ణు రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. తదుపరి చిత్రాలతోనైనా ఈ హీరో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
