బాన్సువాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. 23,582 ఓట్లతో గెలుపొందారు. అయితే స్పీకర్ గా ఉండి విజయం సాధించడం చాలా అరుదు.. కానీ పోచారం దాన్ని తిరగరాశాడు. ఈ క్రమంలో ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవిస్తాం, గెలుపు ఓటములు సహజమన్నారు. ప్రజలు నాపై నమ్మకంతో మళ్ళీ గెలిపించారు.. నా విజయం కాదు ప్రజల విజయం, కార్యకర్తల విజయం అన్నారు.
Read Also: KTR: కాంగ్రెస్ పార్టీకి అభినందనలు.. శుభం జరగాలని కోరుకుంటున్నా: కేటీఆర్
స్పీకర్ పోచారం ప్రజల మనిషి అని తెలిపారు. గతంలో పని చేసిన స్పీకర్ ఓటమి పాలయ్యారు అంటే అది వారి వ్యక్తిగతం అని పేర్కొన్నారు. స్పీకర్ గా చరిత్ర తిరగ రాయడం అంటే సహజమే.. ప్రజలపై విశ్వాసం ప్రజలకు నాపై విశ్వాసం తో గెలిచానని చెప్పారు. ప్రజల తీర్పు శిరసా వహించాలని పేర్కొన్నారు. అధికారం, పదవులు ఎవరికి శాశ్వతం కాదు.. జీవితంలో చాలా మంది సీఎంలను చూసాను, కేసీఆర్ నాయకత్వం ఓడిపోలేదని స్పీకర్ పోచారం తెలిపారు.