NTV Telugu Site icon

Sonia gandhi: జూన్ 2 తెలంగాణకు సోనియా రాక.. రాష్ట్ర గీతం ఆవిష్కరణ!

Sie

Sie

కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ జూన్ 2న తెలంగాణకు రానున్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. దాదాపు 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Virat Kohli: ‘నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా’.. విరాట్ సంచలన వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియాగాంధీ చేత తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. “జయ జయ హే తెలంగాణ” అనే గీతాన్ని ప్రముఖ కవి మరియు గేయ రచయిత అందె శ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4 న కేబినెట్ అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది. ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేలా గీతంలో స్వల్ప మార్పులను మంత్రివర్గం సూచించింది. దాదాపు 1.5 నిమిషాల నిడివి గల తుది వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ గీతానికి సంగీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు.

ఇది కూడా చదవండి: Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని చూస్తారు..

ఇదిలా ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అందె శ్రీ, కీరవాణిలు కలిసి పాటపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారి పనిని అభినందించారు. ఈ సమావేశంలో అందె శ్రీ సవరించిన గీతాన్ని ప్రదర్శించారు. ఈ పాటను జూన్ 2న విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ముఖ్యమంత్రి సీపీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు అధికారిక రాష్ట్ర గీతం లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అందె శ్రీ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా పరిగణించలని నిర్ణయం తీసుకున్నారు.