Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Somireddy Chandramohan Reddy Alleged That The Mining Mafia In Nellore Is Like The Movie Kgf 3

Somireddy: నెల్లూరులో కేజీఎఫ్-3 లాగా మైనింగ్ మాఫియా

Published Date :December 19, 2023 , 1:29 pm
By Chandra Shekhar Pamena
Somireddy: నెల్లూరులో కేజీఎఫ్-3 లాగా మైనింగ్ మాఫియా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mining Mafia: నెల్లూరు జిల్లాలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన సిలికాన్.. 3 వేల కోట్ల విలువైన తెల్ల రాయిని దోచేశారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే ఇది ఒక పెద్ద కుంభకోణం.. సెంట్రల్ విజిలెన్స్ తో పాటు అధికారుల అందరికీ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరాం.. మైనింగ్ లేచి దారులకు రెన్యువల్ చేయకుండా వైసీపీ నేతలు వాటిలో అక్రమంగా తెల్ల రాయిని తవ్వుతున్నారు.. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ఇంత వరకు అధికారులు స్పందించలేదు అని ఆయన ఆరోపించారు. అక్కడికి వెళ్లి మళ్లీ చూడగా 14 హిటాచీలు, జిలేటిన్ స్టిక్స్, ట్రక్స్ ను పెట్టి మైనింగ్ చేస్తున్నారు.. బ్లాస్టింగ్ చేస్తుండడంతో చుట్టు పక్కల ఉండే గిరిజనులు భయపడుతున్నారు.. పేలుడు పదార్థాలను భద్రత లేకుండా నిల్వ ఉంచారు అంటూ సోమిరెడ్డి విమర్శించారు.

Read Also: PM Modi: పార్లమెంట్‌లోకి చొరబడిన వారికి ప్రతిపక్షాల మద్దతు దురదృష్టకరం : ప్రధాని మోడీ

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారు అంటూ మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కే వాటాలు ఇస్తున్నారు.. ఒక్కో మండలాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు పంచుకున్నారు.. లీజు పర్మిట్ లేకుండా ఇంత దోపిడీ చేస్తున్నా.. ఎవరూ స్పందించడం లేదు అని తెలిపారు. కేజీఎఫ్-3 లాగా దోచుకుంటున్నారు.. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని నేను నిరసన కార్యక్రమాన్ని చేపడితే దానిని కూడా భగ్నం చేశారు అంటూ ఆయన ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా నన్ను తరలించారు.. నా నిరసనను భగ్నం చేసేందుకు హిజ్రాలను తీసుకువచ్చారు.. రౌడీలను పంపించి నా కారు అద్దాలను ధ్వంసం చేశారు.. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇంతటి ఘోరాన్ని చూడలేదు.. బీహార్, ఉత్తరప్రదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్ కూడా మారిపోయింది అని సోమిరెడ్డి మండిపడ్డారు.

Read Also: Raghunandan Rao: రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు

ఏం చేయాలో మాకు తెలుసు.. అదే చేస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కార్యాచరణ రూపొందించి పోరాడుతాం.. త్వరలో మా ప్రభుత్వం వస్తుంది.. ఎస్పీ, కలెక్టర్లు జాగ్రత్తగా ఉండాలి.. అందరి మీదా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. మంత్రి గోవర్ధన్ రెడ్డి నాపైకి హిజ్రాలు, రౌడీలను పంపించారు.. ఆయన అంటే ప్రజలకు ఏమిటో తెలిసింది అని మాజీ మంత్రి అన్నారు. నాకు విదేశాలలో వెయ్యి కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు.. అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంగీకరించారు.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి అని చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • KGF-3 Movie
  • mining mafia
  • Nellore
  • somireddy chandramohan reddy

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions