భారతీయ సినీ రంగంలో ఒకప్పుడు సినిమా విజయాన్ని దాని కథ, కథనం మరియు ప్రేక్షకుల ఆదరణను బట్టి అది హిట్ లేదా ప్లాప్ గా డిసైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు సినిమా సినారియో మారిపోయింది. ఇప్పుడు అంతా బాక్సాఫీస్ మయం అయిపోయింది. కోట్లు కలెక్షన్స్ వస్తేనే హిట్ అనే భావనలో ఉన్నారు. దీనిపై బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు
సినిమా బిజినెస్ గురించి ఆయన విశ్లేషిస్తూ.. “ప్రస్తుతం ప్రతి సినిమా ‘వంద కోట్ల క్లబ్’ లో చేరుతోంది. దాని గురించి ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరి దృష్టి ఇప్పుడు కేవలం రూ. 500 కోట్లు లేదా రూ. 1000 కోట్ల క్లబ్ పైనే ఉంది. కలెక్షన్లే సినిమా స్థాయిని నిర్ణయిస్తాయన్నట్లుగా పరిస్థితి తయారైంది. కొన్ని సినిమాల కలెక్షన్లు చూస్తుంటే అవి మన దేశ జనాభా కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కథాబలం కంటే వసూళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బడ్జెట్ కంటే కంటెంట్నే తాను నమ్ముతాను. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో తక్కువ బడ్జెట్తో అద్భుతమైన కథలను వెండితెరపైకి తీసుకువస్తారని, హాలీవుడ్ దర్శకులతో పోటీ పడే సత్తా మన కథలకు ఉందని’ అన్నారు. ప్రస్తుతం ఆయన అక్షయ్ కుమార్తో ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది భూత్ బంగ్లా. వరుస ప్లాప్స్ తో వెనుకబడిన ప్రియదర్శన్ ఈ సినిమాతో హిట్ కొడతానని ధీమాగా ఉన్నారు.
