NTV Telugu Site icon

Chitradurga shocker: ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. అసలేం జరిగిందంటే?

Karnataka

Karnataka

Chitradurga shocker: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. చిత్రదుర్గ నగరంలోని పాత బెంగళూరు రోడ్డులోని ఓ పాడుబడిన ఇంట్లో గురువారం ఐదుగురు వ్యక్తుల అస్థిపంజరాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం రాత్రి పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తమై ఆ తర్వాత పరిసరాల్లో సోదాలు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు రాత్రి తర్వాత అక్కడికి చేరుకుని అవశేషాల నుంచి నమూనాలను సేకరించారు. ఆ కుటుంబం పూర్తిగా ఏకాంత జీవితం గడిపిందని, ఆ ఐదుగుపు పూర్తిగా 2019లో జులైలో చివరిసారిగా కనిపించారని, అనంతరం వారి నివాసానికి తాళం వేసి ఉందని తెలిసింది. ఇప్పుడు ఇలా అస్థిపంజరాలు దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Read Also: Canada : కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడి.. హుండీల దొంగ దొరికేశాడు

బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ స్థలం రిటైర్డ్ ఇంజనీర్ జగన్నాథరెడ్డికి చెందినదని, కొన్నాళ్లుగా అతని కుటుంబం కనిపించడం లేదని తెలిపారు. దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఇల్లు మూసి ఉంచబడింది. 2019లో ఆ నివాసం నుంచి దుర్వాసన వచ్చింది. చనిపోయిన ఎలుక చనిపోయిందనుకుని స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయలేదు. సుమారు రెండు నెలల క్రితం, ఉదయం అక్కడ నుంచి వెళ్తున్న సమయంలో స్థానికులు ఆ ఇంటి తలుపు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు, అయినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆ ఇంటి వెనుక ద్వారం కూడా పగలగొట్టబడింది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు తనిఖీలు చేపట్టడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ ఇంట్లో జగన్నాథరెడ్డి (సుమారు 80 సంవత్సరాలు), అతని భార్య ప్రేమ (70 సంవత్సరాలు), వారి కుమార్తె త్రివేణి, కుమారులు కృష్ణారెడ్డి, నరేంద్ర రెడ్డిలు నివాసముంటున్నారు. జగన్నాథరెడ్డి పెద్ద కుమారుడు మంజునాథ్ రెడ్డి కొన్నేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జగన్నాథ్ రెడ్డి బంధువు పవన్ కుమార్ మరణాలపై అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసుకు సంబంధించి తదుపరి విచారణలు జరుగుతున్నాయి.