బాలీవుడ్ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా పితృవియోగంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన తండ్రి సునీల్ మల్హోత్రా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 14న తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిపాడు.
Also Read : Priyamani: గ్లోబల్ స్క్రీన్పై సౌత్ బ్యూటీ.. హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి!
తన తండ్రి గురించి సిద్ధార్థ్ గొప్పగా స్మరించుకుంటూ.. ‘ఆయన క్రమశిక్షణ, నిజాయతీ, విలువలకు మారుపేరు. కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. పక్షవాతం (Stroke) కారణంగా ఆయన వీల్చైర్కే పరిమితమైనా, ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. చివరకు ఏ బాధా లేకుండా నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు” అని పేర్కొన్నారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహమేనని సిద్ధార్థ్ గుర్తుచేసుకున్నారు. సునీల్ మల్హోత్రా గతంలో మర్చంట్ నేవీలో కెప్టెన్గా పనిచేశారు. ఆయన మరణవార్త తెలియగనే బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సిద్ధార్థ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సిద్ధార్థ్ తన తండ్రితో కలిసి ఉన్న పాత జ్ఞాపకాలను పంచుకుంటూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.
