Financial Problems: చదువుల తల్లికి ఆర్థిక పరిస్థితులే అడ్డంకి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Financial Problems: చదువుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఉన్నత చదువులు చదివి అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. అందుకు కుటుంబ నేపధ్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండి తీరాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో తన ఆశయం, తన కల నెరవేరదేమో అని ఆందోళన చెందుతుంది ఓ అమ్మాయి. వివరాల్లోకి వెళితే… సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన గొర్రెల కాపరి స్వామి, బీడీ కార్మికురాలు నాగమణి ముగ్గురు కుమార్తెలలో రెండో కూతురు స్రవంతి చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉంటూ చదువుకుంటుంది. చిన్నప్పటి నుంచి పేదరికం ఎంతగా వెనక్కి లాగినా.. అన్ని పరీక్షల్లోనూ కష్టపడి అధిక మార్కులు సాధిస్తూ వచ్చింది. 10వ తరగతితో పాటు డిప్లొమా వరకు చదువులో అగ్రస్థానంలో నిలిచింది. హార్టికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (HORTICET-2022) కోసం కూడా అదే పంథాలో కొనసాగింది. రాష్ట్రంలో మూడో ర్యాంక్ సాధించింది.
రాష్ట్రంలోనే మూడో ర్యాంక్ సాధించినా కూడా మరో రెండు రోజుల్లో రూ.50 వేలు చెల్లిస్తే తప్ప తాను అడ్మిషన్ను పొందలేని పరిస్థితి దాపురించింది. వీరి చిన్న ఇల్లు తప్ప మరో ఆధారం లేదు. తల్లిదండ్రులు ఇప్పటివరకు ముగ్గురు కూతుళ్లకు రెక్కలు ముక్కలు చేసుకుని ఎలాగోలా ఫీజును చెల్లించగలిగారు. ముగ్గురు కూతుళ్లూ చదువులో తమ ప్రతిభను కనబరిచారు. ఇప్పటివరకైనా ఎలాగోలా నెట్టుకొచ్చారు కానీ ఉన్నత విద్య కోసం వెచ్చించే స్థోమత లేక ఆందోళన చెందుతున్నారు. పెద్ద కూతురు కళ్యాణి 2020లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసింది, కానీ ఆర్థిక సహాయం లేకపోవడంతో చదువు కొనసాగించలేకపోయింది. కళ్యాణి ఇప్పుడు ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని, ఉద్యోగం సంపాదించి జీవనోపాధి పొందాలనే ఆశతో ఎదురుచూస్తోంది.
Also Read
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
Metro Rail: శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోరైలు విషయంలో కీలక పరిణామం
ఆదిలాబాద్లోని హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో హార్టికల్చర్లో డిప్లొమా పూర్తి చేసిన స్రవంతి అక్కడ కూడా 9.3 జీపీఏ సాధించి టాప్లో నిలిచింది. ఆమె 10వ తరగతిలో కూడా 10 జీపీఏ సాధించింది. ఇప్పుడు హార్టిసెట్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించి, నవంబర్ చివరలో ఫలితాలు ప్రకటించబడిన తర్వాత ముందుకు సాగడం చాలా కష్టంగా మారింది. నాలుగేళ్లపాటు ప్రతి ఏటా రూ.లక్ష చెల్లించాల్సి ఉండగా, డిసెంబరు 5న కౌన్సెలింగ్ జరగనున్నందున రూ.50,000 చెల్లించి అడ్మిషన్ను నిర్ధారించుకోవడం సవాలుగా మారింది. ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త పులి రాజు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్రవంతికి మద్దతు ఇవ్వాలని పలువురిని ఆయన కోరుతున్నారు. అయితే తమ పిల్లల చదువు కోసం ఎవరైనా సాయం చేయాలని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!