Siddaramaiah: ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య కొత్త పల్లవి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీల నేతలు ఆయా రకాలుగా ప్రజలను అభ్యర్థిస్తున్నారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త పల్లవి అందుకున్నారు. తాను ముఖ్యమంత్రి కొనసాగాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ ఆధిక్యం అందించాలని సొంత నియోజకవర్గమైన వరుణ ఓటర్లకు భావోద్వేగపూరితంగా మనవి చేశారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్లో ఏదో జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
2019 లోక్సభ ఎన్నికల సమయంలో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 1,817 ఓట్ల తేడాతో ఓడిపోయారని.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వరుణలో తనకు 48 వేల ఓట్ల మెజారిటీ అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు లోక్సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థికి 60 వేల ఓట్ల ఆధిక్యం కట్టబెడితే సంతోషిస్తానని తెలిపారు. అదే జరిగితే.. తనను ఎవరూ తాకలేరని చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉండాలా? వద్దా? అనేది మీరందించే ఆధిక్యాన్ని బట్టి ఉంటుందని ఓటర్లనుద్దేశించి సిద్ధరామయ్య ప్రసంగించారు.
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
వాస్తవానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. కానీ చివరికి సిద్ధరామయ్య ఆ పీఠంపై కూర్చున్నారు. సీనియార్టీకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధరామయ్య స్వరం మారింది. లోక్సభ ఎన్నికల తర్వాత ఏమైనా మార్పులు జరగొచ్చా? అన్న అనుమానం కల్గుతుంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి.
దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25 మరియు జూన్ 1న తదుపరి ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?