Shubanshu Shukla: Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!
- Axiom-4 మిషన్ విజయవంతం..
- విజయవంతంగా భూమికి చేరిన శుభాంశు శుక్లా అండ్ టీం.
- 18 రోజులు గడిపిన శుక్లా టీమ్..
- మొత్తం 60 రకాల ప్రయోగాలు చేసిన శుక్లా బృందం..
- కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో ల్యాండింగ్..
- క్యాప్సూల్ను స్వాధీనం చేసుకున్న యూఎస్ నేవీ..
- ఏడు రోజుల పాటు క్వారంటైన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు తమ మిషన్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ సమయంలో శుభాంశు శుక్లా దాదాపు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన అనేక ప్రయోగాలు కూడా చేశారు. దాదాపు 23 గంటల ప్రయాణం తర్వాత, ఆయన డ్రాగన్ అంతరిక్ష నౌక కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అయ్యింది. శుంభాషు శుక్లా తన నలుగురు వ్యోమగాములతో కలిసి జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్లో ISSకి బయలుదేరారు. భూమి నుండి 28 గంటల ప్రయాణం తర్వాత వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు ఇక్కడ 18 రోజులు గడిపారు.
Read also:Realme C71: 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ఫోన్ ఇంత తక్కవ ధరలో ఏంటి భయ్యా.. రియల్మీ C71 లాంచ్..!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
- Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
ఇది నాసా, స్పేస్ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన మిషన్. ఈ అంతరిక్ష యాత్రలో 4 దేశాల నుండి నలుగురు వ్యోమగాములు పాల్గొన్నారు. జూలై 14న సాయంత్రం 4:45 గంటలకు శుభాంశు శుక్లాతో పాటు అందరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి బయలుదేరారు. ఈ వ్యోమగాములందరూ జూలై 15న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలిఫోర్నియా తీరంలో స్ప్లాష్ డౌన్ జరిగింది. దీని తర్వాత వ్యోమగాములను సముద్రం నుండి బయటకు తీసుకవెళ్లింది యూఎస్ నేవీ.
వ్యోమగాములకు భద్రతా తనిఖీలు జరిపిన తర్వాత నాసా కేంద్రానికి తరలింపు చేపట్టనన్నారు. అక్కడ ఏడు రోజుల పాటు క్వారంటైన్ చేపట్టనున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపిన తర్వాత భూమికి తిరిగి వచ్చారు. ‘ఆక్సియం-4’ మిషన్ కింద, శుభాంశు శుక్లాతో పాటు అతని ముగ్గురు సహచర వ్యోమగాములు కూడా భూమికి తిరిగి వచ్చారు. 1984లో రాకేష్ శర్మ ప్రయాణం తర్వాత.. అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా చరిత్రలోకి ఎక్కారు.
🚨 𝗦𝗣𝗟𝗔𝗦𝗛𝗗𝗢𝗪𝗡
Gp Capt Shubhanshu Shukla and the Axiom-4 crew are back on Earth!! 🌏
The Crew Dragon 'Grace' capsule has successfully splashed down gently in the Pacific Ocean off the coast of California! 🌊 pic.twitter.com/hF32ouLrZ3
— ISRO Spaceflight (@ISROSpaceflight) July 15, 2025
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
-
PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
-
Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
-
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!