Shubanshu Shukla: Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!
- Axiom-4 మిషన్ విజయవంతం..
- విజయవంతంగా భూమికి చేరిన శుభాంశు శుక్లా అండ్ టీం.
- 18 రోజులు గడిపిన శుక్లా టీమ్..
- మొత్తం 60 రకాల ప్రయోగాలు చేసిన శుక్లా బృందం..
- కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో ల్యాండింగ్..
- క్యాప్సూల్ను స్వాధీనం చేసుకున్న యూఎస్ నేవీ..
- ఏడు రోజుల పాటు క్వారంటైన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు తమ మిషన్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ సమయంలో శుభాంశు శుక్లా దాదాపు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన అనేక ప్రయోగాలు కూడా చేశారు. దాదాపు 23 గంటల ప్రయాణం తర్వాత, ఆయన డ్రాగన్ అంతరిక్ష నౌక కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అయ్యింది. శుంభాషు శుక్లా తన నలుగురు వ్యోమగాములతో కలిసి జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్లో ISSకి బయలుదేరారు. భూమి నుండి 28 గంటల ప్రయాణం తర్వాత వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు ఇక్కడ 18 రోజులు గడిపారు.
Read also:Realme C71: 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ఫోన్ ఇంత తక్కవ ధరలో ఏంటి భయ్యా.. రియల్మీ C71 లాంచ్..!
Also Read
- Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
- Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
ఇది నాసా, స్పేస్ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన మిషన్. ఈ అంతరిక్ష యాత్రలో 4 దేశాల నుండి నలుగురు వ్యోమగాములు పాల్గొన్నారు. జూలై 14న సాయంత్రం 4:45 గంటలకు శుభాంశు శుక్లాతో పాటు అందరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి బయలుదేరారు. ఈ వ్యోమగాములందరూ జూలై 15న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలిఫోర్నియా తీరంలో స్ప్లాష్ డౌన్ జరిగింది. దీని తర్వాత వ్యోమగాములను సముద్రం నుండి బయటకు తీసుకవెళ్లింది యూఎస్ నేవీ.
వ్యోమగాములకు భద్రతా తనిఖీలు జరిపిన తర్వాత నాసా కేంద్రానికి తరలింపు చేపట్టనన్నారు. అక్కడ ఏడు రోజుల పాటు క్వారంటైన్ చేపట్టనున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపిన తర్వాత భూమికి తిరిగి వచ్చారు. ‘ఆక్సియం-4’ మిషన్ కింద, శుభాంశు శుక్లాతో పాటు అతని ముగ్గురు సహచర వ్యోమగాములు కూడా భూమికి తిరిగి వచ్చారు. 1984లో రాకేష్ శర్మ ప్రయాణం తర్వాత.. అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా చరిత్రలోకి ఎక్కారు.
🚨 𝗦𝗣𝗟𝗔𝗦𝗛𝗗𝗢𝗪𝗡
Gp Capt Shubhanshu Shukla and the Axiom-4 crew are back on Earth!! 🌏
The Crew Dragon 'Grace' capsule has successfully splashed down gently in the Pacific Ocean off the coast of California! 🌊 pic.twitter.com/hF32ouLrZ3
— ISRO Spaceflight (@ISROSpaceflight) July 15, 2025
తాజావార్తలు
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
-
Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
-
CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
-
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!