Shreyas Iyer Fined: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు భారీ జరిమానా.. ఇంకోసారి చేస్తే మ్యాచ్ సస్పెన్షన్.?
- పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు రూ. 24 లక్షల జరిమానా
- స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ కమిటీ చర్యలు
- ఈ సీజన్లో పంజాబ్ జట్టుకు ఇది రెండో తప్పిదం
- ప్లేయింగ్ ఎలెవన్ సభ్యులకు కూడా జరిమానా విధింపు
- ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా 25% మ్యాచ్ ఫీజు జరిమానా
- మూడోసారి ఇదే తప్పు చేస్తే అయ్యర్కు మ్యాచ్ సస్పెన్షన్ అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Fined: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘనవిజయం సాధించిన ఆనందంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయనందుకు (Slow Over-rate) గాను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు రూ. 24 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ సీజన్ లో పంజాబ్ జట్టుకు ఇది రెండో ఓవర్ రేట్ నేరం కావడంతో శిక్ష తీవ్రత పెరిగింది.
IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్తో గుజరాత్ పోరు!
Also Read
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
నిబంధనల ప్రకారం రెండోసారి ఈ తప్పు దొర్లడంతో కేవలం కెప్టెన్ మాత్రమే కాకుండా, ప్లేయింగ్ ఎలెవన్ లోని మిగిలిన ఆటగాళ్లకు (ఇంపాక్ట్ ప్లేయర్తో సహా) కూడా జరిమానా పడింది. వీరికి ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా విధించారు. పంజాబ్ జట్టు ఫీల్డింగ్ సమయంలో సమయాన్ని వృథా చేయడం వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ కమిటీ స్పష్టం చేసింది.
ఇది ఇలా ఉండగా.. పంజాబ్ కింగ్స్ యాజమాన్యాన్ని కలవరపెడుతున్న అంశం మరొకటి ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఈ సీజన్ లో పంజాబ్ జట్టు మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే గనుక.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్ లు మిగిలి ఉండడంతో, పంజాబ్ జట్టు క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఒక్క పొరపాటు జరిగినా కీలక సమయంలో కెప్టెన్ జట్టుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది.
SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?
ఇక నిన్న జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 29 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, ప్రభ్సిమ్రాన్ సింగ్, కూపర్ కానలీలు వారి సహకారం అందించారు. చెన్నై బ్యాటర్లలో ఆయుష్ మ్హాత్రే (73) రాణించినప్పటికీ, పంజాబ్ బ్యాటింగ్ ధాటికి చెన్నై బౌలర్లు నిలవలేకపోయారు. వరుసగా రెండో విజయం అందుకున్న పంజాబ్, ఇప్పుడు ఓవర్ రేట్ విషయంలో కాస్త ఒత్తిడిలోకి వెళ్లింది.
తాజావార్తలు
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!