Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తిలో ఏడో తరగతి విద్యార్థి తన టీచర్ను కొట్టి మరీ కొట్టి ఆస్పత్రిలో చేర్పించాడు. ఇప్పుడు ఆ టీచర్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. సోన్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లాస్లో అందరి ముందు టీచర్.. ఆ విద్యార్థిని రెండు సార్లు చెప్పుతో కొట్టాడు. ఈ విషయం విద్యార్థి అవమానంగా భావించాడు. దీంతో పాఠశాల అయిపోయిన తర్వాత ఉపాధ్యాయుడిని కొట్టాడు. కాకందు గ్రామానికి చెందిన సునీల్ కుమార్ గుప్తా మోహరానియా గ్రామంలో టీచర్ గా పనిచేస్తున్నారు. గురువారం 7వ తరగతి విద్యార్థి ఫర్మాన్ అలీ ఏదో తప్పు చేసినందుకు ఉపాధ్యాయుడు రెండుసార్లు చెప్పుతో కొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఫర్మాన్ పాఠశాల అయిపోయిన తర్వాత టీచర్ కోసం బయట వేచి ఉన్నాడు. ఉపాధ్యాయుడు సునీల్ తన ఇంటికి వెళ్తుండగా ఫర్మాన్ అతనిని అనుసరించాడు.
Read Also:G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..
మార్గమధ్యంలో డికౌలి వంతెన సమీపంలో అతను కర్రతో ఉపాధ్యాయుడిపై దారుణంగా దాడి చేశాడు. దీంతో ఉపాధ్యాయుడు బైక్తో సహా రోడ్డుపై పడిపోయాడు. అనంతరం విద్యార్థిని కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఉపాధ్యాయుడు అపస్మారక స్థితికి వచ్చే వరకు అతన్ని కొట్టాడు. అటుగా వెళ్తున్న వారు పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్ ప్రాణాలను కాపాడారు. దీంతో విద్యార్థి అక్కడి నుంచి పారిపోయాడు. టీచర్ పరిస్థితి విషమంగా ఉండటంతో బహ్రైచ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇక్కడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం పోలీసులకు చేరడంతో వారు విద్యార్థిని పట్టుకుని విచారించారు. విద్యార్థి ఫర్మాన్ మాట్లాడుతూ- క్లాస్లో అందరి ముందు సర్ నన్ను రెండుసార్లు చెప్పుతో కొట్టాడు. అది నాకు నచ్చలేదు. అందరి ముందు నన్ను అవమానించారు. అందుకే టీచర్ మీద పగ తీర్చుకున్నాను అంతే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Read Also:Mohammed Shami: ఎట్టకేలకు సానియా మీర్జాతో పెళ్లి పుకార్లపై మౌనం వీడిన టీమిండియా క్రికెటర్..