Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్ రావు విచారణ..
- 11 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం
- ట్యాపింగ్ ఆదేశాల వెనుక మిస్టరీ ఎవరిది?
- ఎలక్షన్ సర్వేల నుండి SIB సంబంధాల వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారులు 11 గంటల పాటు విచారించారు. ఉదయం ప్రారంభమైన విచారణ రాత్రి వరకు కొనసాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చి ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
శ్రవణ్ రావు వద్ద నుండి స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లను సిట్ అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. వాటిలోని కాల్ లాగ్స్, మెసేజ్లు, వాట్సాప్ చాట్స్ తదితర ఆధారాలను బట్టి ప్రాథమికంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎవరెవరి నంబర్లు ఇచ్చారనే దానిపై శ్రవణ్ను ప్రత్యేకంగా విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరిన్ని విచారణలు జరిపే అవకాశముంది.
Also Read
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు నేపథ్యంగా జరిగిందని అనుమానిస్తున్నారు. శ్రవణ్ రావు ఎవరి ఆదేశాలతో ఈ పనుల్లో పాల్గొన్నారన్న దానిపై కూడా అధికారులు ఆరా తీశారు. ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలపై సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు సేకరించి పంపినట్లు సమాచారం. ఆ నివేదికలు ఎవరి ఆదేశాలతో పంపించబడ్డాయో తెలుసుకునేందుకు సిట్ కృషి చేస్తోంది.
శ్రవణ్ రావు మాజీ ఇంటెలిజెన్స్ శాఖ (SIB) అధికారులు, ఉద్యోగులతో సంబంధాల్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఆ సంబంధాలపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ వ్యవహారంలో శ్రవణ్ రావు మాధ్యమంగా, కొన్ని కీలక రాజకీయ నాయకులకు సమాచారం చేరినట్లు శంకించబడుతోంది. ఆయన ఒక మీడియేటర్ పాత్ర పోషించారనే ఆరోపణలు ప్రాథమిక విచారణలో వచ్చినట్లు సమాచారం.
సిట్ అధికారులు ఈ విచారణతో పూర్తిగా సంతృప్తి చెందలేదు. అందువల్ల ఆయనను మరో మూడు రోజుల్లో మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తుది నివేదిక సిద్ధమయ్యే వరకు మరికొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?