Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్ రావు విచారణ..
- 11 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం
- ట్యాపింగ్ ఆదేశాల వెనుక మిస్టరీ ఎవరిది?
- ఎలక్షన్ సర్వేల నుండి SIB సంబంధాల వరకు
Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారులు 11 గంటల పాటు విచారించారు. ఉదయం ప్రారంభమైన విచారణ రాత్రి వరకు కొనసాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చి ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
శ్రవణ్ రావు వద్ద నుండి స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లను సిట్ అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. వాటిలోని కాల్ లాగ్స్, మెసేజ్లు, వాట్సాప్ చాట్స్ తదితర ఆధారాలను బట్టి ప్రాథమికంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎవరెవరి నంబర్లు ఇచ్చారనే దానిపై శ్రవణ్ను ప్రత్యేకంగా విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరిన్ని విచారణలు జరిపే అవకాశముంది.
Also Read
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు నేపథ్యంగా జరిగిందని అనుమానిస్తున్నారు. శ్రవణ్ రావు ఎవరి ఆదేశాలతో ఈ పనుల్లో పాల్గొన్నారన్న దానిపై కూడా అధికారులు ఆరా తీశారు. ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలపై సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు సేకరించి పంపినట్లు సమాచారం. ఆ నివేదికలు ఎవరి ఆదేశాలతో పంపించబడ్డాయో తెలుసుకునేందుకు సిట్ కృషి చేస్తోంది.
శ్రవణ్ రావు మాజీ ఇంటెలిజెన్స్ శాఖ (SIB) అధికారులు, ఉద్యోగులతో సంబంధాల్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఆ సంబంధాలపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ వ్యవహారంలో శ్రవణ్ రావు మాధ్యమంగా, కొన్ని కీలక రాజకీయ నాయకులకు సమాచారం చేరినట్లు శంకించబడుతోంది. ఆయన ఒక మీడియేటర్ పాత్ర పోషించారనే ఆరోపణలు ప్రాథమిక విచారణలో వచ్చినట్లు సమాచారం.
సిట్ అధికారులు ఈ విచారణతో పూర్తిగా సంతృప్తి చెందలేదు. అందువల్ల ఆయనను మరో మూడు రోజుల్లో మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తుది నివేదిక సిద్ధమయ్యే వరకు మరికొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!