NTV Telugu Site icon

Shocking: షాకింగ్ ఘటన.. పసికందు కడుపులో పిండం

Madhya Pradesh

Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. కాగా.. ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యుల ప్రకారం.. ఇది ప్రతి మిలియన్ మహిళల్లో ఒకరికి ఇలా జరుగుతుందని అన్నారు. కాగా.. నవజాత శిశువును రక్షించేందుకు శస్త్ర చికిత్స చేయించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు.

Read Also: Modi US Tour: 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా..

వివరాల్లోకి వెళ్తే.. సాగర్ జిల్లాకు చెందిన ఓ గర్భిణిలో ఈ అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. కెస్లీకి చెందిన ఓ గర్భిణి తొమ్మిదో నెలలో పరీక్ష కోసం ప్రైవేట్ క్లినిక్‌కి వెళ్లింది. అక్కడ.. మహిళ కడుపులో పెరుగుతున్న నవజాత శిశువు లోపల శిశువు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. దీంతో.. ఆమెను వైద్య కళాశాలకు పిలిచి పరీక్షించారు. మహిళ గర్భంలో మరొక శిశువు, టెరాటోమా ఉనికిని గుర్తించారు. ఈ క్రమంలో.. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పగా, తిరిగి కెస్లీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వచ్చింది. అక్కడ వైద్యులు సాధారణ ప్రసవం చేశారు.

Read Also: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ.. కల్తీ నెయ్యి అంశంపై వివరణ

అల్ట్రాసౌండ్ రిపోర్టులో మహిళ కడుపులో పెరుగుతున్న చిన్నారి కడుపులో గడ్డ కనిపించిందని వైద్యుడు పీపీ సింగ్ తెలిపారు. వైద్య చరిత్రలో ఇలాంటి కేసులు చాలా అరుదు. ఇది ఐదు లక్షల మంది మహిళల్లో ఒకరికి జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 200 కేసులు నమోదయ్యాయి. తన జీవితంలో మొదటిసారిగా అలాంటి సందర్భాన్ని చూశానని వైద్యుడు చెప్పాడు. గర్భిణికి సాధారణ ప్రసవం ద్వారా ఆడపిల్ల పుట్టిందని వైద్యుడు పీపీ సింగ్ తెలిపారు.