Maharastra : శివాజీ విగ్రహం ధ్వంసం కేసులో చర్యలు.. కాంట్రాక్టర్ చేతన్ పాటిల్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్ చేతన్ పాటిల్ ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. చేతన్ను మహారాష్ట్రలోని కొల్హాపుల్లో అరెస్టు చేశారు. స్థానిక క్రైమ్ బ్రాంచ్ బృందం చేతన్ను అరెస్టు చేశారు. ఈరోజు ఆయనను సింధుదుర్గం తీసుకురానున్నారు. 35 అడుగుల ఎత్తైన శివాజీ మహారాజ్ విగ్రహం ఆగస్ట్ 26న అకస్మాత్తుగా పడిపోయింది. 8 నెలల క్రితం డిసెంబర్ 4న శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ విగ్రహం కేవలం 8 నెలల్లోనే పడిపోయింది. శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన తర్వాత మహారాష్ట్రలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని ఉద్ధవ్ వర్గం డిమాండ్ చేసింది.
Read Also:6 Balls 6 Fours: ఒకే ఓవర్ లో ఆరు ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..
Also Read
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
- Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
సింధూదుర్గ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ధ్వంసం గురించి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎవరు పడగొట్టారు, అతను ఏ పార్టీకి చెందినవాడు? ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఛత్రపతి శివాజీ మహారాజ్ను అవమానించినందుకు క్షమాపణలు చెప్పడం వల్ల ఏమీ కాదు, చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Read Also:Occult Worship: వికారాబాద్ లో క్షుద్ర పూజల కలకలం… కాలేజ్ లో ఆవరణలో ఆనవాళ్లు..
సీఎం షిండే, డిప్యూటీ సీఎం క్షమాపణలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పడిపోవడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటన దురదృష్టకరమని సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఈ ఘటనకు సంబంధించి 100 సార్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. త్వరలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తయారు చేస్తానని షిండే తెలిపారు. శివాజీ మహారాజ్ విగ్రహాన్ని భారత నౌకాదళం డిజైన్ చేసి నిర్మించిందని సీఎం షిండే చెప్పారు. ఆ తర్వాత విగ్రహం కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరిపి కొత్త విగ్రహాన్ని నిర్మించేందుకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇంజనీర్లు, ఐఐటీ నిపుణులు, నేవీ అధికారులు ఉన్నారు. ఈ సంఘటనపై, భారత నావికాదళం గురువారం మాట్లాడుతూ.. విగ్రహానికి మరమ్మతులు చేసి వీలైనంత త్వరగా పునఃస్థాపన చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
-
Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
-
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
-
Rohit Sharma and Virat Kohli: 2027 వరల్డ్కప్లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?