RTC Bus: ఆర్టీసీ బస్సులో గొర్రెపోతులు.. టిక్కెట్ కొట్టిన కండక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కుంభమేళా.. వనదేవతల మహాజాతర మేడారంకు భక్తులు భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు తల్లిపిల్లలతో కలిసి వెళ్తున్నారు. అయితే.. మేడారం అనగానే గుర్తొచ్చేంది.. తినడం, తాగడం.. అందుకోసమని ఎన్ని డబ్బులు లెక్కచేయకుండా అక్కడికి వెళ్లి కనీసం మూడు, నాలుగురోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. దేవతలను దర్శించుకున్నాక.. పచ్చని అడవిలో కుటుంబమంతా కలిసి కోళ్లు, మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇలా తమకు ఉన్నంతలో కోళ్లు గానీ, మేకలు గానీ కోస్తారు.
ఇదిలా ఉంటే.. మేడారం జాతరకు బయల్దేరిన ఓ వ్యక్తి మూడు పొట్టేళ్లను ఆర్టీసీ బస్సు ఎక్కించాడు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేడారం జాతరకు భారీగా భక్తులు తరలివెళ్తుండగా.. బస్సుల్లో పట్టుచాలని పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో కూడా పొట్టేళ్లను బస్సు ఎక్కించాడంటే అతను మాములోడు కాదు.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
Read Also: AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్పై విచారణ.. ఏజీ అభ్యర్థనతో వాయిదా వేసిన హైకోర్టు
మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. మేడారం జాతరకు తీసుకెళ్లేందుకు గొర్రె పోతులను బస్సులో ఎక్కించాడు. బస్సులో అయితే తక్కువ ఖర్చులో అయిపోతుందని ఊహించిన వ్యక్తి.. బస్సులో తీసుకెళ్తున్నాడు. అయితే కండక్టర్ కూడా వద్దని చెప్పకుండా.. వాటికి టికెట్ కొట్టాడు. పోతే పోనిలే అన్నట్లుగా గొర్రెలను తీసుకెళ్తున్న ప్రయాణికుడు కూడా వాటికి టికెట్ తీసుకున్నాడు. మరోవైపు.. వాటిని బస్సులో ఎక్కించడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బస్సులో ఉన్న ఓ వ్యక్తి.. ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
మరోవైపు.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలను అనుమతించమని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ వేలాది బస్సులను మేడారంకు నడుపుతోంది. అయితే వీటిలో మూగజీవాలకు ఎంట్రీ లేదని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకు రాకుండా భక్తులు సహకరించాలని కోరారు. అయినప్పటికీ జనాలు వినకుండా మూగజీవాలను బస్సుల్లో తీసుకెళ్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!