Shashi Tharoor: పాక్-అమెరికా రిలేషన్ ఇదేనా..? మధ్యవర్తిత్వంపై థరూర్ సెటైర్లు..
- పాక్ ప్రధాని ట్వీట్పై శశి థరూర్ సెటైర్లు..
- కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టిన కాంగ్రెస్ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సెటైర్లు వేశారు. దాయాది దేశంపై విమర్శలు చేస్తూనే, భారత్ను సమర్థించారు. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అయింది. ‘‘డ్రాఫ్ట్- ఎక్స్ కోసం పాకిస్తాన్ ప్రధాని మెసేజ్’’ అనే ఎడిట్-హిస్టరీ హెడల్ ఉన్నట్లు కనిపించింది. అమెరికా పంపిన మెసేజ్నే షరీఫ్ పోస్ట్ చేశారు.
Read Also: US-Iran War: యుద్ధం మళ్లీ మొదలవుతుందా.? ఇరాన్కు చైనా నుంచి అత్యాధునిక ఆయుధాలు..
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
ఈ వైరల్ పోస్టుపై స్పందించిన థరూర్.. ‘‘అమెరికా, పాకిస్తాన్ కు ఎలాంటి సంబంధం ఉందో మీకు తెలుసా.?’’ అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రధాని కోసం అమెరికా ఆ ట్వీట్ రాసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ మీరు, నేను భారత ప్రధాని కోసం ఎదైనా రాస్తే, దానిపై ‘‘భారత ప్రధాని కోసం డ్రాఫ్ట్’’ అని రాస్తామా? అని అడిగారు. షరీఫ్ చేసిన పోస్టు కొన్ని గంటల ముందు ట్రంప్ చేసిన పోస్ట్ను పోలి ఉందని అన్నారు. అమెరికా కోసం ఇలాంటి పాత్ర పాకిస్తాన్ మాత్రమే పోషించగలదని ఎద్దేవా చేశారు.
ఇరాన్ యుద్ధం జరిగితే మొదటి ప్రభావం దానితో సరిహద్దు పంచుకున్న పాకిస్తాన్పై పడుతుందని, శరణార్థుల భారం పాకిస్తాన్ భరించాల్సిందే అని ఆయన అన్నారు. శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూనే, భారత్కు ఎవరు మధ్యవర్తిత్వం చేస్తున్నారనేది ముఖ్యం కాదని, ఫలితం ఏంటనేదే ముఖ్యమని థరూర్ చెప్పారు. దౌత్యపరంగా మౌనం కూడా ఒక సహకారమే అని ఆయన అన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, భారత్కు ఎదురుదెబ్బ అంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు థరూర్ చెక్ పెట్టినట్లు అయింది.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం