Share Markets: ప్రాఫిట్ బుకింగ్ మధ్య భారీగా నష్టపోయిన మార్కెట్స్..

Share Market

Share Market

వచ్చే వారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌ కు శ్రీకారం చుట్టడంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌ లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 75,170 పాయింట్స్ వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 22,888 పాయింట్స్ వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 466 పాయింట్లు నష్టపోయి 52,294 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 144 పాయింట్లు క్షీణించి 16,875 వద్ద ముగిసింది.

Man Stomach: అది కడుపా లేక.. గ్యారేజా.. వ్యక్తి కడుపులో గోళ్లు, సూదులు, బోల్ట్‌లు..

భారతదేశ అస్థిరత సూచిక 4.31% క్షీణించి 24.19 వద్ద ఉంది. రంగాల వారీగా ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, రియల్టీ, ఎనర్జీ షేర్లు ఎక్కువగా నష్టపోగా., ఫార్మా, మీడియా షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్‌టిపిసి, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, రిలయన్స్ టాప్ లూజర్‌ లుగా ఉండగా., ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్‌యుఎల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎం అండ్ ఎం మంగళవారం టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

Kerala Express: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. కదులుతున్న రైలు ముందు దూకేసిన అమ్మాయి..

బొనాంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్‌ లోని రీసెర్చ్ అనలిస్ట్ వైభవ్ విద్వానీ మాట్లాడుతూ., శనివారం ఎగ్జిట్ పోల్స్‌ కు ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా విధానాన్ని ఎంచుకుంటున్నారని, ఇది ఎన్నికల ఫలితాల గురించి ఒక ఆలోచన ఇవ్వగలదని అన్నారు. జూలైలో బడ్జెట్ అంచనాలు, ఇది డిఫెన్స్, ఇన్‌ఫ్రా, రైల్వే బడ్జెట్ నుండి ప్రయోజనం పొందే రంగాలకు మద్దతు ఇస్తుంది అని ఆయన చెప్పారు.