Share Market Opening: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఇప్పట్లో కోలుకునేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Share Market Opening: పశ్చిమాసియాలో హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య ప్రారంభమైన యుద్ధ ప్రభావం విస్తృతంగా మారుతోంది. దాడి తర్వాత నేడు మొదటిసారి బహిరంగ మార్కెట్ ప్రారంభంలోనే కుప్పకూలింది. ప్రారంభ ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండూ భారీ పతనానికి గురయ్యాయి. సెన్సెక్స్ 470 పాయింట్లకు పైగా పతనంతో ప్రారంభమైంది. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా క్షీణించి 65,500 పాయింట్ల దిగువన ట్రేడవుతుండగా, నిఫ్టీ దాదాపు 170 పాయింట్లు పడిపోయి 19,485 పాయింట్ల దిగువన ఉంది.
ప్రీ-ఓపెన్ సెషన్లో మార్కెట్ భారీ క్షీణత సంకేతాలను చూపుతోంది. ప్రీ-ఓపెన్ సెషన్లో, సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పడిపోయింది, నిఫ్టీ కూడా దాదాపు 1 శాతం నష్టంలో ఉంది. గిఫ్టీ సిటీలో నిఫ్టీ ఫ్యూచర్స్ దాదాపు 30 పాయింట్లు పడిపోయాయి. ఈ సంకేతాలన్నీ ఈరోజు మార్కెట్ నష్టాలతోనే ప్రారంభం కావొచ్చని సూచిస్తున్నాయి. గత వారం దేశీయ మార్కెట్కు మిశ్రమంగా కనిపించింది. ప్రారంభంలో మార్కెట్లో క్షీణత కనిపించగా చివరి రెండు రోజుల్లో మార్కెట్ పునరాగమనం చేయడంలో విజయవంతమైంది. వారం చివరి రోజైన శుక్రవారం సెన్సెక్స్ దాదాపు 365 పాయింట్లు బలపడి 66 వేల పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ దాదాపు 110 పాయింట్లు జంప్ చేసి 19,655 పాయింట్లకు చేరుకుంది.
Also Read
- Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
- Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
Read Also:Israel-Hamas War: ఇజ్రాయెల్- హమాస్ పోరు.. ఒక్క సారిగా ఎగిసిన ముడి చమురు ధరలు
ప్రపంచ మార్కెట్లో మిశ్రమ ధోరణి ఉంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.87 శాతం పెరిగింది. నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్లో 1.60 శాతంచ, S&P 500లో 1.18 శాతం ర్యాలీ జరిగింది. శుక్రవారం అమెరికా మార్కెట్ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ పై హమాస్ దాడి జరిగింది కాబట్టి అమెరికా మార్కెట్ స్పందన ఈరోజు తేలనుంది. నేటి ట్రేడింగ్లో ఆసియా మార్కెట్లో మిశ్రమ ధోరణి నెలకొంది. జపాన్కు చెందిన నిక్కీ 0.26 శాతం పతనమైంది. హాంకాంగ్లోని హాంగ్సెంగ్లో తుఫాను హెచ్చరిక తర్వాత మార్కెట్ను మధ్యలోనే మూసివేశారు.
నేటి ట్రేడింగ్లో చాలా పెద్ద స్టాక్లు నష్టాలను చవిచూశాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్లో 24 రెడ్ జోన్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్లో, హెచ్సిఎల్ టెక్, టిసిఎస్, ఇన్ఫోసిస్ మరియు టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయి. మరోవైపు టాటా స్టీల్, ఎన్టీపీసీలో 2-2 శాతానికి పైగా క్షీణత ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వంటి షేర్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి.
Read Also:Telangana Elections 2023: నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్.. ఎవరి వ్యూహాల్లో వారు బిజీ!
తాజావార్తలు
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!