Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Share Market Investors Earned More Than 6 Lakh Crore In Just 4 Days On Bse Sensex

Stock Market : 4నెలల్లో రూ.6.88లక్షల సంపాదించిన ఇన్వెస్టర్లు.. రూ. 373 లక్షల కోట్లకు చేరుకున్న మార్కెట్ క్యాప్

Published Date :January 13, 2024 , 7:02 am
By Rakesh Reddy
Stock Market : 4నెలల్లో రూ.6.88లక్షల సంపాదించిన ఇన్వెస్టర్లు.. రూ. 373 లక్షల కోట్లకు చేరుకున్న మార్కెట్ క్యాప్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Stock Market : జనవరి 2024 కంపెనీలు, పెట్టుబడిదారులకు అద్భుతమైనదిగా పరిగణించబడుతోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.373 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.6.88 లక్షల కోట్లు పోగేశారు. సెన్సెక్స్ భారీగా పెరుగుదల కొనసాగింది. శుక్రవారం గరిష్ట స్థాయి 72,720.96కి చేరుకుంది.

30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ శుక్రవారం 847.27 పాయింట్లు లేదా 1.18 శాతం పెరిగి 72,568.45 వద్ద ముగిసింది. శుక్రవారం ఐటీ స్టాక్స్‌లో భారీ జంప్ కనిపించింది. రోజులో ఇది 999.78 పాయింట్లకు పెరిగింది. ఈ విధంగా నాలుగు రోజుల్లోనే బీఎస్‌ఈ బెంచ్‌మార్క్‌లో 1,213.23 పాయింట్ల జంప్ నమోదైంది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు రూ.6,88,711.19 కోట్లు ఆర్జించగా, మార్కెట్ క్యాప్ రూ.3,73,29,676.27 కోట్లకు చేరింది.

Also Read

  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
  • Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!
  • CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..

Read Also:Allu Arjun : ఆ రెండు సినిమాలను మరోసారి గుర్తు చేసుకున్న ఐకాన్ స్టార్..

శుక్రవారం బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 5.06 శాతం పెరిగింది. టెక్ కూడా 4.40 శాతం పెరగగా.. ఇన్ఫోసిస్ షేర్లు 8 శాతం పెరిగాయి. టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) షేర్లు కూడా దాదాపు 4 శాతం మేర పెరిగాయి. ఈ రెండు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా రావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం కనిపించింది. దీంతో ఇతర ఐటీ కంపెనీలు కూడా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కూడా ఈ పెరుగుదల నుండి లాభపడ్డాయి.

ఐటీ రంగంలో బడా కంపెనీల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినోద్ నాయర్ అన్నారు. దీంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా మంచి పనితీరు కనబరిచాయి. ఈ వారం ఇన్వెస్టర్ల సంపద గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా భారత స్టాక్ మార్కెట్లు కూడా కొత్త శిఖరాలను తాకాయి. బిఎస్‌ఇలో మొత్తం 2,112 షేర్లు పెరిగాయి, 1,742 తగ్గాయి. 88 షేర్లలో ఎటువంటి మార్పు కనిపించలేదు. బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 0.41 శాతం, మిడ్‌క్యాప్ 0.36 శాతం పెరిగింది.

Read Also:Chandrababu: తెలుగు ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు

భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు శుక్రవారం గొప్ప రోజు. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లో 800 పాయింట్లు, నిఫ్టీలో 250 పాయింట్లకు పైగా ర్యాలీ కనిపించింది. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 847 పాయింట్ల జంప్‌తో 72,568 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 248 పాయింట్ల జంప్‌తో 21,894 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ ఇప్పుడు 22,000 ఫిగర్‌కు చాలా దగ్గరగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BSE
  • Infosys
  • investors wealth
  • IT shares
  • Sensex

తాజావార్తలు

  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!

  • LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..

  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

  • KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు

  • Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్‌ప్లే + 7200mAh

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions