Stock Market : 4నెలల్లో రూ.6.88లక్షల సంపాదించిన ఇన్వెస్టర్లు.. రూ. 373 లక్షల కోట్లకు చేరుకున్న మార్కెట్ క్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market : జనవరి 2024 కంపెనీలు, పెట్టుబడిదారులకు అద్భుతమైనదిగా పరిగణించబడుతోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.373 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.6.88 లక్షల కోట్లు పోగేశారు. సెన్సెక్స్ భారీగా పెరుగుదల కొనసాగింది. శుక్రవారం గరిష్ట స్థాయి 72,720.96కి చేరుకుంది.
30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ శుక్రవారం 847.27 పాయింట్లు లేదా 1.18 శాతం పెరిగి 72,568.45 వద్ద ముగిసింది. శుక్రవారం ఐటీ స్టాక్స్లో భారీ జంప్ కనిపించింది. రోజులో ఇది 999.78 పాయింట్లకు పెరిగింది. ఈ విధంగా నాలుగు రోజుల్లోనే బీఎస్ఈ బెంచ్మార్క్లో 1,213.23 పాయింట్ల జంప్ నమోదైంది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు రూ.6,88,711.19 కోట్లు ఆర్జించగా, మార్కెట్ క్యాప్ రూ.3,73,29,676.27 కోట్లకు చేరింది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Read Also:Allu Arjun : ఆ రెండు సినిమాలను మరోసారి గుర్తు చేసుకున్న ఐకాన్ స్టార్..
శుక్రవారం బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 5.06 శాతం పెరిగింది. టెక్ కూడా 4.40 శాతం పెరగగా.. ఇన్ఫోసిస్ షేర్లు 8 శాతం పెరిగాయి. టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) షేర్లు కూడా దాదాపు 4 శాతం మేర పెరిగాయి. ఈ రెండు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా రావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం కనిపించింది. దీంతో ఇతర ఐటీ కంపెనీలు కూడా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఈ పెరుగుదల నుండి లాభపడ్డాయి.
ఐటీ రంగంలో బడా కంపెనీల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినోద్ నాయర్ అన్నారు. దీంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా మంచి పనితీరు కనబరిచాయి. ఈ వారం ఇన్వెస్టర్ల సంపద గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా భారత స్టాక్ మార్కెట్లు కూడా కొత్త శిఖరాలను తాకాయి. బిఎస్ఇలో మొత్తం 2,112 షేర్లు పెరిగాయి, 1,742 తగ్గాయి. 88 షేర్లలో ఎటువంటి మార్పు కనిపించలేదు. బిఎస్ఇ స్మాల్క్యాప్ 0.41 శాతం, మిడ్క్యాప్ 0.36 శాతం పెరిగింది.
Read Also:Chandrababu: తెలుగు ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు
భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు శుక్రవారం గొప్ప రోజు. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్లో 800 పాయింట్లు, నిఫ్టీలో 250 పాయింట్లకు పైగా ర్యాలీ కనిపించింది. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 847 పాయింట్ల జంప్తో 72,568 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 248 పాయింట్ల జంప్తో 21,894 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ ఇప్పుడు 22,000 ఫిగర్కు చాలా దగ్గరగా ఉంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..