Shadi Mubarak Scam: ‘షాదీ ముబారక్’ పేరుతో భారీ దోపిడి.. రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shadi Mubarak Scam: షాదీ ముబారక్ పేరుతో భారీ దోపిడికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముటా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితులకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు సహకరించినట్టు గుర్తించారు. నిందితులు ఏకంగా రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్టు నిర్ధారించారు అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకమైన షాదీ ముబారక్ పేరుతో నకలి పత్రాలు సృష్టించి సుమారు 21 లక్షల ప్రభుత్వ నిధులను కాజేసిన అంతర్రాష్ట్ర ముటాను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. హసర్ నగర్ లోని ఫాతిమా కాలనీలో ఒక ఇంటిలో షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన నకలి పాత్రాలు తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో.. అత్తాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు.
Also Read
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- CM Chandrababu: సింగపూర్లో 'సీబీఎన్@361 డిగ్రీస్' పుస్తకావిష్కరణ!
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
ప్రధాన నిందితుడు మహమ్మద్ ఎతిమాద్ ఉల్హక్ నివాసంలో నిర్వహించిన తనికిల్లో భారి ఎత్తున నకలీ దరఖాస్తులు, ఐడి ప్రూఫ్లు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఎతిమాద ఆధార్ ఆపరేటర్ గా పనిచేస్తూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో వధువుల ఫోటోలు వివాహ ధృవీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను ఫోర్జరీ చేసి నకలీ దరఖాస్తులు తయారు చేసినట్లుగా తేలింది. అనంతరం ఈ దరఖస్తులను బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి ప్రభుత్వ నిధులు మంజూరయ్యేలా కుట్ర పండినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధరావత అశోక్ కిరణ్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే నిధులు మంజూరయ్యేలా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన నిందితలు నకలి లబ్దిదరులను గుర్తించడం, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించడం, అక్రమంగా వచ్చిన సొమ్మును పంచుకోవడంలో భాగస్వామ్యులైనట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 21 లక్షల మేర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. నిందుతుల వద్ద నుంచి ఒక లాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్ ఆరు మొబైల్ ఫోన్లు, నకలి దరఖాస్తులు, ఫోర్జరీ చేసిన ఐడి ప్రూఫ్ లో 21 లక్షల విలువైన 21 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపుర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేని నిందితులను కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
తాజావార్తలు
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
-
CM Chandrababu: సింగపూర్లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ!
-
Kanatha Kaanom OTT Release : ఓటీటీలోకి యోగి బాబు తమిళ కామెడీ.. తెలుగులోనూ చూడవచ్చు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?