Shadi Mubarak Scam: ‘షాదీ ముబారక్’ పేరుతో భారీ దోపిడి.. రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shadi Mubarak Scam: షాదీ ముబారక్ పేరుతో భారీ దోపిడికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముటా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితులకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు సహకరించినట్టు గుర్తించారు. నిందితులు ఏకంగా రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్టు నిర్ధారించారు అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకమైన షాదీ ముబారక్ పేరుతో నకలి పత్రాలు సృష్టించి సుమారు 21 లక్షల ప్రభుత్వ నిధులను కాజేసిన అంతర్రాష్ట్ర ముటాను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. హసర్ నగర్ లోని ఫాతిమా కాలనీలో ఒక ఇంటిలో షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన నకలి పాత్రాలు తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో.. అత్తాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
ప్రధాన నిందితుడు మహమ్మద్ ఎతిమాద్ ఉల్హక్ నివాసంలో నిర్వహించిన తనికిల్లో భారి ఎత్తున నకలీ దరఖాస్తులు, ఐడి ప్రూఫ్లు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఎతిమాద ఆధార్ ఆపరేటర్ గా పనిచేస్తూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో వధువుల ఫోటోలు వివాహ ధృవీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను ఫోర్జరీ చేసి నకలీ దరఖాస్తులు తయారు చేసినట్లుగా తేలింది. అనంతరం ఈ దరఖస్తులను బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి ప్రభుత్వ నిధులు మంజూరయ్యేలా కుట్ర పండినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధరావత అశోక్ కిరణ్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే నిధులు మంజూరయ్యేలా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన నిందితలు నకలి లబ్దిదరులను గుర్తించడం, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించడం, అక్రమంగా వచ్చిన సొమ్మును పంచుకోవడంలో భాగస్వామ్యులైనట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 21 లక్షల మేర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. నిందుతుల వద్ద నుంచి ఒక లాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్ ఆరు మొబైల్ ఫోన్లు, నకలి దరఖాస్తులు, ఫోర్జరీ చేసిన ఐడి ప్రూఫ్ లో 21 లక్షల విలువైన 21 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపుర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేని నిందితులను కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!