Shadi Mubarak Scam: ‘షాదీ ముబారక్’ పేరుతో భారీ దోపిడి.. రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shadi Mubarak Scam: షాదీ ముబారక్ పేరుతో భారీ దోపిడికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముటా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితులకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు సహకరించినట్టు గుర్తించారు. నిందితులు ఏకంగా రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్టు నిర్ధారించారు అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకమైన షాదీ ముబారక్ పేరుతో నకలి పత్రాలు సృష్టించి సుమారు 21 లక్షల ప్రభుత్వ నిధులను కాజేసిన అంతర్రాష్ట్ర ముటాను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. హసర్ నగర్ లోని ఫాతిమా కాలనీలో ఒక ఇంటిలో షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన నకలి పాత్రాలు తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో.. అత్తాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు.
Also Read
ప్రధాన నిందితుడు మహమ్మద్ ఎతిమాద్ ఉల్హక్ నివాసంలో నిర్వహించిన తనికిల్లో భారి ఎత్తున నకలీ దరఖాస్తులు, ఐడి ప్రూఫ్లు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఎతిమాద ఆధార్ ఆపరేటర్ గా పనిచేస్తూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో వధువుల ఫోటోలు వివాహ ధృవీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను ఫోర్జరీ చేసి నకలీ దరఖాస్తులు తయారు చేసినట్లుగా తేలింది. అనంతరం ఈ దరఖస్తులను బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి ప్రభుత్వ నిధులు మంజూరయ్యేలా కుట్ర పండినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధరావత అశోక్ కిరణ్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే నిధులు మంజూరయ్యేలా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన నిందితలు నకలి లబ్దిదరులను గుర్తించడం, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించడం, అక్రమంగా వచ్చిన సొమ్మును పంచుకోవడంలో భాగస్వామ్యులైనట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 21 లక్షల మేర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. నిందుతుల వద్ద నుంచి ఒక లాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్ ఆరు మొబైల్ ఫోన్లు, నకలి దరఖాస్తులు, ఫోర్జరీ చేసిన ఐడి ప్రూఫ్ లో 21 లక్షల విలువైన 21 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపుర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేని నిందితులను కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!