GST: గుడ్ న్యూస్.. జీఎస్టీని 18శాతం నుంచి 5శాతానికి తగ్గించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST: భారతదేశం 2023ని మిల్లెట్ల సంవత్సరంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముతక ధాన్యాలను ప్రోత్సహించేందుకు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అపెక్స్ బాడీ ముతక ధాన్యాలకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై పన్నును తగ్గించాలని నిర్ణయించింది. దీంతో రానున్న కాలంలో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.
Read Also:Israel-Gaza Conflict: ఇజ్రాయెల్ – గాజా మధ్య యుద్ధ వాతావరణం.. 5000 రాకెట్ల ప్రయోగం
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ కౌన్సిల్ GSTకి సంబంధించి అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం మండలి 52వ సమావేశం జరుగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో మిల్లెట్ ఫ్లోర్ ఫుడ్ ప్రిపరేషన్స్పై జీఎస్టీ రేట్లను ప్రస్తుత 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జిఎస్టి కౌన్సిల్కు చెందిన ఫిట్మెంట్ కమిటీ గతంలో పొడి మిల్లెట్కు మినహాయింపు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ముతక ధాన్యాల నుంచి తయారయ్యే ఉత్పత్తులపై జీఎస్టీలో మినహాయింపు ఇస్తూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేసినా కౌన్సిల్ పట్టించుకోలేదు.
Read Also:Bigg Boss 7 Telugu: ‘తొక్కలో సంచాలక్..బొక్కలో తీర్పు ‘.. అమర్ పరువుతీసిన నాగ్..
ఇటీవల మిల్లెట్ అంటే ముతక ధాన్యాల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం ముతక ధాన్యాలను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం 2023ని మిల్లెట్ ఇయర్గా అంటే ముతక ధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నారు. దేశంలో ముతక ధాన్యాల ఉత్పత్తి, వినియోగం రెండింటినీ వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముతక ధాన్యాలు ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయని చెబుతున్నారు. ముతక ధాన్యాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే, ముతక ధాన్యాలను తక్కువ నీటిలో పండించవచ్చు. వాటిని పండించడానికి రసాయన ఎరువులు తక్కువ అవసరం. ఈ విధంగా ముతక ధాన్యాలను ప్రోత్సహించడం పర్యావరణానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!