Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా దక్షిణ అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 7 మంది నక్సలైట్లు హతమయ్యారు. భద్రతా బలగాలు ఈ ఎన్కౌంటర్ లో నక్సలైట్లకు సంబంధించిన రెడ్ మిలిటెంట్ల సెంట్రల్ కమిటీలో భాగమైన టాప్ నక్సలైట్ లిడార్ స్థాయిలో ఉన్న మృతదేహంతో సహా వారందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ పై భద్రతా బలగాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్కౌంటర్ ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైందని, నక్సలైట్లతో భద్రతా బలగాల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగినట్లు చెప్పారు. నారాయణపూర్, దంతేవాడ, జగదల్పూర్, కొండగావ్ ప్రాంతాల్లో ప్రత్యేక దళాలు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సంయుక్త బృందం దక్షిణ అబుజ్మద్ ప్రాంతంలో యాంటీ నక్సల్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు.
Also Read: Akshay Kumar Injured: షూటింగ్లో గాయపడ్డ స్టార్ హీరో
ఈ ఆపరేషన్లో భాగంగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నక్సలైట్లకు చెందిన 7 మంది తాజా ఎన్కౌంటర్లో హతమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 15న బస్తర్లో పర్యటించనున్నారు. షా బస్తర్ పర్యటనకు రాబోతున్న సమయంలో అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలు 7 మంది నక్సలైట్లను హతమార్చాయి. మాద్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో 4 జిల్లాల నుండి వెయ్యి మందికి పైగా సైనికులను ఈ సెర్చ్ ఆపరేషన్ కోసం తరలించారు.
Also Read: Car Price Hike Alert: కారు కొందామనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.. ఆలస్యమైతే ఇక బాదుడే