Big Alert: హైదరాబాద్ శివారులో ఇల్లు కొనుగోలు చేసే వారికి బిగ్ అలర్ట్..
- మోసం జరిగిందని స్క్రాప్ వ్యాపారి ఆత్మహత్య..
- బకాయిలు కూడా వసూలు కావడం లేదని మనస్తాపం..
- సూసైడ్ లేఖ రాసి కారులో వదిలిపెట్టిన వైనం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని అమీర్పేటలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన 42 ఏళ్ల స్క్రాప్ వ్యాపారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రియల్ ఎస్టేట్ మోసానికి గురై మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వనస్థలిపురంలో ఒక ఇంటిని సుమారు 3.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన ఆయనకు, అది నకిలీ పత్రాలతో జరిగిన విక్రయమని తెలియడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. కేవలం ఈ ఇల్లు మాత్రమే కాకుండా, తన వ్యాపారంలో కూడా ఇతరుల నుంచి సుమారు 6.8 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని, ఆర్థికంగా తాను మోసపోయానని ఆయన భావించారు.
ఈ క్రమంలోనే బలవన్మరణానికి సిద్ధపడిన ప్రవీణ్, బేగంపేటలోని రెనెక్సా టవర్స్ సమీపంలో ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకుని, అక్కడ ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. తన మరణానికి ముందు తన భార్య పేరిట సూసైడ్ నోట్ రాసి కారులో ఉంచారు. అందులో తనను మోసం చేసిన వ్యక్తుల వివరాలు, రావాల్సిన బకాయిల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు తన భార్యకు సెల్ఫోన్ ద్వారా లొకేషన్ షేర్ చేయడంతో.. ఆమె వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే ప్రవీణ్ మృతి చెంది ఉన్నారు.
Also Read
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
- Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
- Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
Also Read:Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ రాసిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆయనను మోసం చేసిన వ్యక్తులపై దర్యాప్తు ప్రారంభించారు. భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకోవడం మరియు నమ్మిన వారే వంచించడంతో కలిగిన మనస్తాపమే ఈ ఘోర నిర్ణయానికి దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఒక సంపన్న వ్యాపారి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
తాజావార్తలు
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
-
Jana Nayakudu: ‘జన నాయకుడు’ పోస్టర్తో అంచనాలు పెంచిన విజయ్.. జూలై 23న బాక్సాఫీస్పై దండయాత్ర!
-
Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!