Big Alert: హైదరాబాద్ శివారులో ఇల్లు కొనుగోలు చేసే వారికి బిగ్ అలర్ట్..
- మోసం జరిగిందని స్క్రాప్ వ్యాపారి ఆత్మహత్య..
- బకాయిలు కూడా వసూలు కావడం లేదని మనస్తాపం..
- సూసైడ్ లేఖ రాసి కారులో వదిలిపెట్టిన వైనం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని అమీర్పేటలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన 42 ఏళ్ల స్క్రాప్ వ్యాపారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రియల్ ఎస్టేట్ మోసానికి గురై మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వనస్థలిపురంలో ఒక ఇంటిని సుమారు 3.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన ఆయనకు, అది నకిలీ పత్రాలతో జరిగిన విక్రయమని తెలియడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. కేవలం ఈ ఇల్లు మాత్రమే కాకుండా, తన వ్యాపారంలో కూడా ఇతరుల నుంచి సుమారు 6.8 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని, ఆర్థికంగా తాను మోసపోయానని ఆయన భావించారు.
ఈ క్రమంలోనే బలవన్మరణానికి సిద్ధపడిన ప్రవీణ్, బేగంపేటలోని రెనెక్సా టవర్స్ సమీపంలో ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకుని, అక్కడ ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. తన మరణానికి ముందు తన భార్య పేరిట సూసైడ్ నోట్ రాసి కారులో ఉంచారు. అందులో తనను మోసం చేసిన వ్యక్తుల వివరాలు, రావాల్సిన బకాయిల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు తన భార్యకు సెల్ఫోన్ ద్వారా లొకేషన్ షేర్ చేయడంతో.. ఆమె వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే ప్రవీణ్ మృతి చెంది ఉన్నారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
Also Read:Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ రాసిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆయనను మోసం చేసిన వ్యక్తులపై దర్యాప్తు ప్రారంభించారు. భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకోవడం మరియు నమ్మిన వారే వంచించడంతో కలిగిన మనస్తాపమే ఈ ఘోర నిర్ణయానికి దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఒక సంపన్న వ్యాపారి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?