Big Alert: హైదరాబాద్ శివారులో ఇల్లు కొనుగోలు చేసే వారికి బిగ్ అలర్ట్..
- మోసం జరిగిందని స్క్రాప్ వ్యాపారి ఆత్మహత్య..
- బకాయిలు కూడా వసూలు కావడం లేదని మనస్తాపం..
- సూసైడ్ లేఖ రాసి కారులో వదిలిపెట్టిన వైనం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని అమీర్పేటలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన 42 ఏళ్ల స్క్రాప్ వ్యాపారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రియల్ ఎస్టేట్ మోసానికి గురై మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వనస్థలిపురంలో ఒక ఇంటిని సుమారు 3.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన ఆయనకు, అది నకిలీ పత్రాలతో జరిగిన విక్రయమని తెలియడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. కేవలం ఈ ఇల్లు మాత్రమే కాకుండా, తన వ్యాపారంలో కూడా ఇతరుల నుంచి సుమారు 6.8 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని, ఆర్థికంగా తాను మోసపోయానని ఆయన భావించారు.
ఈ క్రమంలోనే బలవన్మరణానికి సిద్ధపడిన ప్రవీణ్, బేగంపేటలోని రెనెక్సా టవర్స్ సమీపంలో ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకుని, అక్కడ ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. తన మరణానికి ముందు తన భార్య పేరిట సూసైడ్ నోట్ రాసి కారులో ఉంచారు. అందులో తనను మోసం చేసిన వ్యక్తుల వివరాలు, రావాల్సిన బకాయిల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు తన భార్యకు సెల్ఫోన్ ద్వారా లొకేషన్ షేర్ చేయడంతో.. ఆమె వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే ప్రవీణ్ మృతి చెంది ఉన్నారు.
Also Read
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
Also Read:Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ రాసిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆయనను మోసం చేసిన వ్యక్తులపై దర్యాప్తు ప్రారంభించారు. భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకోవడం మరియు నమ్మిన వారే వంచించడంతో కలిగిన మనస్తాపమే ఈ ఘోర నిర్ణయానికి దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఒక సంపన్న వ్యాపారి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
తాజావార్తలు
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!