TG School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడు, రేపు పాఠశాలలకు సెలవు
- నేడు, రేపు పాఠశాలలకు సెలవు
- GHMC పరిధిలోని పాఠశాలలకు హాఫ్ డే
- హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13, 14 తేదీల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వానలతో రాష్ట్రం తడిసి ముద్దైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 72 గంటలు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యం లో నేడు, రేపు GHMC పరిధిలోని పాఠశాలలకు హాఫ్ డే ప్రకటించిది విద్యాశాఖ.
Also Read:Coolie : వామ్మో.. ‘కూలీ’ ఒక్క టికెట్ ఎన్ని వేలో తెలుసా..?
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
ఆగస్టు 13, 14 తేదీలలో హాఫ్ డే మాత్రమే పనిచేయనున్నాయి. GHMC పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆగస్టు 13, 14 తేదీలలో హాఫ్ డే సెలవు ఉండనున్నది. పాఠశాలలు ఉదయం పూట మాత్రమే పనిచేస్తాయి. పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ఈ 5 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13, 14 తేదీల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఉండనుంది.
Also Read:Nara Lokesh: 30 ఏళ్ల తరువాత.. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది..!
ఐటి సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇవ్వాలని సూచించింది. వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల పాటు ఇరిగేషన్ శాఖలో అధికారుల సెలవులు రద్దు చేశారు. ప్రాజెక్టులు.. రిజర్వాయర్లు..కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నా నేను కూడా అందుబాటులో ఉంటానన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!