Tummala Nageswara Rao : సత్తుపల్లి అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది
- సత్తుపల్లి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- రైతులకు మద్దతుగా ప్రభుత్వం
- సీతారామ ప్రాజెక్టుతో సాగునీటి సదుపాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యతాలకుంట గ్రామంలో సీతారామ టన్నెల్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై విశేషాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉందని, తాను రాజకీయ చైతన్యం వచ్చినప్పటి నుండి అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ప్రతి గిరిజన గ్రామానికి రహదారులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్య కోసం పిల్లలు స్కూల్స్కు సులభంగా వెళ్లగలిగే పరిస్థితి రావడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. “ప్రతి రైతు ఆనందంగా ఉండాలి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు వెంటనే స్పందించాలి” అని సూచించారు. అలాగే, “రైతు భరోసా పథకం కింద ఈ నెలాఖరు వరకు రూ.10 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాం” అని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం అని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా బేతుపల్లి, లంకాసాగర్ ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు చేరనున్నాయి. అలాగే, శ్రీరామ చంద్రుని కృపతో కొద్ది నెలల్లోనే గోదావరి జలాలను సాగు కోసం వినియోగించగలమని తెలిపారు.
Also Read
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ప్రస్తుతం ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలకు నమ్మకం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని మంత్రి అభిప్రాయపడ్డారు. సత్తుపల్లిలో ఎలాంటి సమస్యలు లేవని, స్థానిక ఎమ్మెల్యే రాగమయి ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు “పంటలు లాభసాటిగా ఉండేలా హార్టికల్చర్ను ప్రోత్సహించాలి. హార్టికల్చర్ చేయలేని స్థితిలో ఉంటే వరి పండించండి” అని సూచించారు. ఫామాయిల్ ధర గతంలో రూ.1200గా ఉండేదని, ప్రస్తుతం అది రూ.20,800కి పెరిగిందని తెలిపారు. అలాగే, ఉగాది నాటికి ఖమ్మం జిల్లాలోని కల్లూరు గూడెంలో ఫామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
ఖమ్మం నుంచి రాజమండ్రికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం ఆగస్టు 15నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనితో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని, వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. “నా మొట్ట మొదటి కోరిక సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ సహకారంతో ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి, రైతులకు నీటిని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లి అభివృద్ధిలో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ వివాదంపై బీసీసీఐ అసంతృప్తి.. సెలెక్టర్లకు కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!