Sankranti Festival: పట్నం వదిలి పల్లె బాట.. భారీగా పెరిగిన విమాన ఛార్జీలు
Sankranti Festival: సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్న ప్రజలు.. పక్క రాష్ట్రాల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఓవైపు.. విమానయాన సంస్థలు మరోవైపు.. భారీగా ధరలు పెంచేశాయి.. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి.. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ బూతులను ఓపెన్ చేశారు.. ఫాస్టాగ్ ఉండడంతో త్వర త్వరగా వెళ్తున్న వాహనాలు.. అయితే, ఫాస్టాగ్ లేని వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రేపు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉండడంతో వాహనాలపై మరింత పెరిగే అవకాశం ఉంది.
సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకునేందుకు పట్టణవాసులు పల్లెబాట పట్టారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో 16 నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ వాతావరణం నెలకొంది. 10 గుంటలకు కూడా పొగమంచు కమ్మేసి ఉండడంతో వాహనదారులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ నాలుగు రోజులు గోదావరి జిల్లాలో కోడి పందాలు తోపాటు పర్యాటక ప్రాంతాల్లో విహరించేందుకు పెద్ద ఎత్తున అతిధులు తరలివస్తున్నారు. దీంతో గోదారి జిల్లాల పల్లెలన్నీ సందడిగా మారుతున్నాయి.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
మరోవైపు.. రాజమండ్రి ఎయిర్ పోర్టులో సంక్రాంతి రద్దీ నెలకొంది.. దేశ విదేశాల్లో ఉన్న గోదావరి జిల్లా వాసులు క్యూ కడుతున్నారు. దీంతో రద్దీ పెరిగింది.. సంక్రాంతికి సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. మరోవైపు విమాన చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ రోజుల్లో 3000 రూపాయలు ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 12 వేలకు పైగా ధర పలుకుతుంది. విమాన చార్జీలు భారీగా పెరిగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.. ఇక, ప్రైవేట్ బస్సులు కూడా పండుగ సీజన్ను క్యాష్ చేసుకుంటున్నాయి.. సాధారణం కంటే రెండు, మూడు రెట్లు బస్సు టికెట్ల ధరలను పెంచేశాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏదేమైనా పండుగకు ఊరికి వెళ్లాలన్న ఉద్దేశంతో ప్రయాణ ఛార్జీలు పెరిగినా.. పల్లె బాట పడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?