NTV Telugu Site icon

IND vs ZIM: రాణించిన సంజూ శాంసన్.. జింబాబ్వే టార్గెట్..?

Ind

Ind

జింబాబ్వే జరుగుతున్న చివరి టీ20లో భారత్ 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి జింబాబ్వే ముందు 168 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. భారత్ బ్యాటింగ్లో సంజా శాంసన్ (58) పరుగులతో రాణించాడు. మొదట్లో మంచి ఆరంభం లభించలేదు. వరుసగా 3 వికెట్లు పడిపోయాయి. దీంతో.. శాంసన్ క్రీజులోకి వచ్చి నిలకడగా ఆడాడు. అతనికి తోడు రియాన్ పరాగ్ (22) భాగస్వామ్యాన్ని అందించాడు.

Read Also: Russia: ట్రంప్‌పై హత్యాయత్నం.. జో బైడెన్‌పై రష్యా సంచలన వ్యాఖ్యలు..

టీమిండియా బ్యాటింగ్లో నిన్నటి మ్యాచ్ హీరో యశస్వీ జైస్వాల్ (12) పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత.. గిల్ (13), అభిషేక్ శర్మ (14) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత శాంసన్ అర్థ సెంచరీ చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అతని ఇన్నింగ్స్లో 4 సెక్సులు, 1 ఫోర్ ఉంది. ఆ తర్వాత రియాన్ పరాగ్ 24 బంతుల్లో 22 పరుగులు, శివం దూబే కూడా క్రీజులో ఉన్నంత సేపు (26) రన్స్ చేసి పర్వాలేదనిపించాడు.

Read Also: Siddharth 40: సిద్ధార్థ్ మూవీతో కంబ్యాక్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

ఆ తర్వాత రింకూ సింగ్ (11*), వాషింగ్టన్ సుందర్ (1*) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలింగ్లో ముజారబానీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సికిందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మావుట తలో వికెట్ తీశారు. కాగా.. ఇప్పటికే ఈ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి 4-1 తేడాతో ముగించాలని టీమిండియా చూస్తోంది.