Snake In Meals : మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము..భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake In Meals : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ చిన్నారి మధ్యాహ్న భోజనం ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో కలకలం రేగింది. ఈ విషయంపై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము కనిపించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. అంగన్ వాడీలో మధ్యాహ్న భోజన పథకం కింద చిన్నారికి మధ్యాహ్న భోజన ప్యాకెట్ అందజేశారు. ఈ పథకం కింద అంగన్వాడీ, నర్సరీ పాఠశాలల్లో 6 నెలల నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో పాలూస్లోని చిన్నారి తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారం ప్యాకెట్లో చనిపోయిన పాము ఫొటో తీసి స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు పంపారు. ఈ విషయాన్ని సీరియస్గా అభివర్ణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రస్తుత అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దీనిని లేవనెత్తారు.
Read Also:Aarambham: ‘ఆరంభం’ ఆరంభమైంది.. ఎక్కడ చూడాలంటే?
Also Read
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
ప్యాకెట్ను తెరిచి చూడగా చనిపోయిన పాము
సోమవారం సాంగ్లి జిల్లా పలుస్లో అంగన్వాడీ కార్యకర్తలు మధ్యాహ్న భోజన పథకం కింద మధ్యాహ్న భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించిందని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. ఫుడ్ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్లానని చెప్పాడు. దాన్ని తెరిచి చూడగా లోపల చనిపోయిన పాము కనిపించింది. దాన్ని ఫొటో తీసి అంగన్వాడీ కార్యకర్తకు పంపించాడు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము రావడంతో అధికారులు షాక్కు గురయ్యారు.
Read Also:Telangana: TGPSC వద్ద ఉద్రిక్తత.. BJYM కార్యకర్తలు అరెస్ట్..
ల్యాబ్ కు ఆహార నమూనాలు
రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్త మా జిల్లా సేవికా గ్రూపునకు ఫొటో పంపే సమయానికి ఫిర్యాదుదారు కుటుంబీకులు పామును ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్ల నుంచి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పాలస్-కెడగావ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత వర్షాకాల సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!