Snake In Meals : మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము..భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake In Meals : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ చిన్నారి మధ్యాహ్న భోజనం ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో కలకలం రేగింది. ఈ విషయంపై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము కనిపించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. అంగన్ వాడీలో మధ్యాహ్న భోజన పథకం కింద చిన్నారికి మధ్యాహ్న భోజన ప్యాకెట్ అందజేశారు. ఈ పథకం కింద అంగన్వాడీ, నర్సరీ పాఠశాలల్లో 6 నెలల నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో పాలూస్లోని చిన్నారి తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారం ప్యాకెట్లో చనిపోయిన పాము ఫొటో తీసి స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు పంపారు. ఈ విషయాన్ని సీరియస్గా అభివర్ణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రస్తుత అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దీనిని లేవనెత్తారు.
Read Also:Aarambham: ‘ఆరంభం’ ఆరంభమైంది.. ఎక్కడ చూడాలంటే?
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ప్యాకెట్ను తెరిచి చూడగా చనిపోయిన పాము
సోమవారం సాంగ్లి జిల్లా పలుస్లో అంగన్వాడీ కార్యకర్తలు మధ్యాహ్న భోజన పథకం కింద మధ్యాహ్న భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించిందని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. ఫుడ్ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్లానని చెప్పాడు. దాన్ని తెరిచి చూడగా లోపల చనిపోయిన పాము కనిపించింది. దాన్ని ఫొటో తీసి అంగన్వాడీ కార్యకర్తకు పంపించాడు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము రావడంతో అధికారులు షాక్కు గురయ్యారు.
Read Also:Telangana: TGPSC వద్ద ఉద్రిక్తత.. BJYM కార్యకర్తలు అరెస్ట్..
ల్యాబ్ కు ఆహార నమూనాలు
రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్త మా జిల్లా సేవికా గ్రూపునకు ఫొటో పంపే సమయానికి ఫిర్యాదుదారు కుటుంబీకులు పామును ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్ల నుంచి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పాలస్-కెడగావ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత వర్షాకాల సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!