Snake In Meals : మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము..భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake In Meals : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ చిన్నారి మధ్యాహ్న భోజనం ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో కలకలం రేగింది. ఈ విషయంపై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము కనిపించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. అంగన్ వాడీలో మధ్యాహ్న భోజన పథకం కింద చిన్నారికి మధ్యాహ్న భోజన ప్యాకెట్ అందజేశారు. ఈ పథకం కింద అంగన్వాడీ, నర్సరీ పాఠశాలల్లో 6 నెలల నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో పాలూస్లోని చిన్నారి తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారం ప్యాకెట్లో చనిపోయిన పాము ఫొటో తీసి స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు పంపారు. ఈ విషయాన్ని సీరియస్గా అభివర్ణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రస్తుత అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దీనిని లేవనెత్తారు.
Read Also:Aarambham: ‘ఆరంభం’ ఆరంభమైంది.. ఎక్కడ చూడాలంటే?
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
ప్యాకెట్ను తెరిచి చూడగా చనిపోయిన పాము
సోమవారం సాంగ్లి జిల్లా పలుస్లో అంగన్వాడీ కార్యకర్తలు మధ్యాహ్న భోజన పథకం కింద మధ్యాహ్న భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించిందని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. ఫుడ్ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్లానని చెప్పాడు. దాన్ని తెరిచి చూడగా లోపల చనిపోయిన పాము కనిపించింది. దాన్ని ఫొటో తీసి అంగన్వాడీ కార్యకర్తకు పంపించాడు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము రావడంతో అధికారులు షాక్కు గురయ్యారు.
Read Also:Telangana: TGPSC వద్ద ఉద్రిక్తత.. BJYM కార్యకర్తలు అరెస్ట్..
ల్యాబ్ కు ఆహార నమూనాలు
రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్త మా జిల్లా సేవికా గ్రూపునకు ఫొటో పంపే సమయానికి ఫిర్యాదుదారు కుటుంబీకులు పామును ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్ల నుంచి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పాలస్-కెడగావ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత వర్షాకాల సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
-
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?