Snake In Meals : మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము..భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake In Meals : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ చిన్నారి మధ్యాహ్న భోజనం ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో కలకలం రేగింది. ఈ విషయంపై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము కనిపించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. అంగన్ వాడీలో మధ్యాహ్న భోజన పథకం కింద చిన్నారికి మధ్యాహ్న భోజన ప్యాకెట్ అందజేశారు. ఈ పథకం కింద అంగన్వాడీ, నర్సరీ పాఠశాలల్లో 6 నెలల నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో పాలూస్లోని చిన్నారి తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారం ప్యాకెట్లో చనిపోయిన పాము ఫొటో తీసి స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు పంపారు. ఈ విషయాన్ని సీరియస్గా అభివర్ణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రస్తుత అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దీనిని లేవనెత్తారు.
Read Also:Aarambham: ‘ఆరంభం’ ఆరంభమైంది.. ఎక్కడ చూడాలంటే?
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ప్యాకెట్ను తెరిచి చూడగా చనిపోయిన పాము
సోమవారం సాంగ్లి జిల్లా పలుస్లో అంగన్వాడీ కార్యకర్తలు మధ్యాహ్న భోజన పథకం కింద మధ్యాహ్న భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించిందని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. ఫుడ్ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్లానని చెప్పాడు. దాన్ని తెరిచి చూడగా లోపల చనిపోయిన పాము కనిపించింది. దాన్ని ఫొటో తీసి అంగన్వాడీ కార్యకర్తకు పంపించాడు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము రావడంతో అధికారులు షాక్కు గురయ్యారు.
Read Also:Telangana: TGPSC వద్ద ఉద్రిక్తత.. BJYM కార్యకర్తలు అరెస్ట్..
ల్యాబ్ కు ఆహార నమూనాలు
రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్త మా జిల్లా సేవికా గ్రూపునకు ఫొటో పంపే సమయానికి ఫిర్యాదుదారు కుటుంబీకులు పామును ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్ల నుంచి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పాలస్-కెడగావ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత వర్షాకాల సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!