Snake In Meals : మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము..భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake In Meals : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ చిన్నారి మధ్యాహ్న భోజనం ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో కలకలం రేగింది. ఈ విషయంపై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము కనిపించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. అంగన్ వాడీలో మధ్యాహ్న భోజన పథకం కింద చిన్నారికి మధ్యాహ్న భోజన ప్యాకెట్ అందజేశారు. ఈ పథకం కింద అంగన్వాడీ, నర్సరీ పాఠశాలల్లో 6 నెలల నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించడంతో పాలూస్లోని చిన్నారి తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారం ప్యాకెట్లో చనిపోయిన పాము ఫొటో తీసి స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు పంపారు. ఈ విషయాన్ని సీరియస్గా అభివర్ణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రస్తుత అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దీనిని లేవనెత్తారు.
Read Also:Aarambham: ‘ఆరంభం’ ఆరంభమైంది.. ఎక్కడ చూడాలంటే?
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ప్యాకెట్ను తెరిచి చూడగా చనిపోయిన పాము
సోమవారం సాంగ్లి జిల్లా పలుస్లో అంగన్వాడీ కార్యకర్తలు మధ్యాహ్న భోజన పథకం కింద మధ్యాహ్న భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్యాకెట్లో చనిపోయిన పాము కనిపించిందని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. ఫుడ్ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్లానని చెప్పాడు. దాన్ని తెరిచి చూడగా లోపల చనిపోయిన పాము కనిపించింది. దాన్ని ఫొటో తీసి అంగన్వాడీ కార్యకర్తకు పంపించాడు. మధ్యాహ్న భోజన ప్యాకెట్లో పాము రావడంతో అధికారులు షాక్కు గురయ్యారు.
Read Also:Telangana: TGPSC వద్ద ఉద్రిక్తత.. BJYM కార్యకర్తలు అరెస్ట్..
ల్యాబ్ కు ఆహార నమూనాలు
రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది భోసలే మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్త మా జిల్లా సేవికా గ్రూపునకు ఫొటో పంపే సమయానికి ఫిర్యాదుదారు కుటుంబీకులు పామును ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. మధ్యాహ్న భోజన ప్యాకెట్ల నుంచి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పాలస్-కెడగావ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత వర్షాకాల సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!