Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: ఈ మధ్య చిన్న కారణానికే హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఓ కర్రీ పాయింట్లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. రూ.10కి సాంబార్ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి తల్వార్తో దాడికి దిగిన సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఘటనకు సంబంధించి అందిన వివరాల ప్రకారం.. కర్రీ పాయింట్లో పనిచేస్తున్న ఉదయ్ అనే యువకుడిని జీవన్ అనే వ్యక్తి రూ.10కి సాంబార్ ఇవ్వమని అడిగాడు. అయితే అక్కడ సాంబార్ ప్యాకెట్ ధర రూ.30 ఉండటంతో, రూ.10కి ఇవ్వడం సాధ్యం కాదని ఉదయ్ చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన జీవన్, అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో తీవ్రంగా స్పందించాడు.
మొదట గొడవ పడి వెళ్లిన జీవన్ కొద్దిసేపటికి తల్వార్తో తిరిగి వచ్చి షాప్ షట్టర్ మూసివేసి ఉదయ్పై దాడికి యత్నించాడు. ఈ సమయంలో అడ్డుకునేందుకు వచ్చిన క్యాషియర్పై కూడా దాడి చేయడంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం జీవన్ షట్టర్ తెరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!