Sandeshkhali: రాష్ట్రపతిని కలిసిన సందేశ్ఖాలీ బాధితులు.. ఏం విజ్ఞప్తి చేశారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందేశ్ఖాలీ బాధితులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బాధితులు కలిసి తమ ఆవేదనను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. సందేశ్ఖాలీలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సమాజాన్ని కాపాడేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని బాధితులు కోరారు.
ఎస్సీ, ఎస్టీ సపోర్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పార్థ బిస్వాస్తో కలిసి సందేశ్ఖాలీ బాధితులైన మహిళలు రాష్ట్రపతిని కలిశారు. బాధితులు ముర్ముకు మెమోరాండం సమర్పించినట్లు పార్థ బిస్వాస్ తెలిపారు.
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
రాష్ట్రపతి చాలా సానుభూతితో బాధితుల ఆవేదనను తెలుసుకున్నారని పార్థ బిస్వాస్ పేర్కొన్నారు. విషయం తెలుసుకుని ముర్ము చాలా బాధపడ్డారని తెలిపారు. రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఢిల్లీకి వచ్చారని చెప్పుకొచ్చారు.
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో ఉన్న బీద కుటుంబాలను రక్షించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని బాధితులు లేఖలో పేర్కొన్నారు. తీవ్ర అన్యాయానికి గురవుతున్నట్లు రాష్ట్రపతికి అందజేసిన మెమోరాండంలో పేర్కొన్నారు.
గత కొంతకాలంగా సందేశ్ఖాలీ ప్రాంతం ఆందోళనలతో అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్, అతని అనుచరులు భూకబ్జా, లైంగిక వేధింపులకు గురి చేశారంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా నిరసనలు చేపట్టారు.

షాజహాన్ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కాపాడుతున్నారంటూ పెద్ద ఎత్తన విమర్శలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక హైకోర్టు జోక్యంతో నిందితుడు షాజహాన్ను సీబీఐకి పోలీసులు అప్పగించారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఇటీవల పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోడీని బాధిత మహిళలు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని ఆవేదన చెందారు. దీంతో వారి బాధలు విని కలత చెందారు. తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి మొర్ర పెట్టుకున్నారు. న్యాయం చేస్తానని ద్రౌపది ముర్ము హామీ ఇచ్చారు.
#WATCH | Delhi | Sandeshkhali incident | Dr. Partha Biswas, Director of the Center for SC/ST Support and Research says, "They (victims) are being identified and threatened that when the media would not be around them and Sheikh Shahjahan would return, what would happen to… pic.twitter.com/J6YCo92Ass
— ANI (@ANI) March 15, 2024
తాజావార్తలు
-
Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!