Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులలో భాగమైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని రవాణా, హైదరాబాద్ ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి అజారుద్దీన్తో కలిసి నూతనంగా రూపుదిద్దుకున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితో పాటు తుది దశకు చేరుకున్న మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కాలేరు వెంకటేష్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సుమారు రూ.680 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక స్టీల్ బ్రిడ్జి చంచల్గూడ జైలు ప్రాంగణం నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు, అలాగే మరోవైపు చంపాపేట వైపు సులభంగా వెళ్లేలా మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. అతిత్వరలోనే ఈ వంతెనను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సైదాబాద్, సంతోష్నగర్, చంచల్గూడ, చంపాపేట తదితర ప్రాంతాల ప్రజలకు సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
Also Read
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
అలాగే మూసారాంబాగ్ వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు సైతం చివరి ఘట్టానికి చేరుకున్నాయని, రాకపోకలకు వీలుగా అప్రోచ్ రోడ్ల విస్తరణను వేగవంతం చేశామని తెలిపారు. నగరంలో నానాటికీ పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపట్టిన బ్రిడ్జి పనులతో పాటు పెండింగ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజా రవాణాను మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రాధాన్యమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?