Sabitha Indra Reddy : పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ పేరు ఉంటే తప్పేంటి.?
తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉంటే తప్పేమిటని తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ ఫొటో, గుర్తును తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె సూచించారు. ట్విట్టర్ వేదికగా.. ‘పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ పేరు ఉంటే తప్పేంటి? తాము పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు ఆలస్యంగా అందించే సంస్కృతికి ముగింపు పలికాం. ఆరునెలలు ముందు నుంచే ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లి పుస్తకాలు,యూనిఫారాలను విద్యార్థులకు పాఠ్య అందించే ప్రయత్నం చేశాం. తాము ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు రూ.108 కోట్లు వెచ్చించి రెండు జతల యూనిఫారాలు, రూ.200 కోట్లకు వెచ్చించి రూ.1.90 కోట్ల ఉచిత పుస్తకాలను ముద్రించి సకాలంలో ఇచ్చాం. ఇక రాష్ట్రంలో తొలిసారిగా ఏ ప్రభుత్వం చేయనట్లుగా రూ.34.70 కోట్లతో 11.27 లక్షల మందికి వర్కబుక్స్ రూ.56.24 కోట్లతో, రూ.12.30 కోట్లతో ఉచిత నోట్ బుక్స్ పంపిణీకి శ్రీకారం చుట్టాము. విద్యార్థులందరికీ తాము యూనిఫారాలు,పాఠ్యపుస్తకాలు సందర్భంగా గుర్తుచేశారు. జూన్ 12 అందచేశాము.’ అని పోస్ట్ చేశారు.
అంతేకాకుండా.. ‘ కేసీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి గుర్తులు తొలగించాలని ఆలోచనను పక్కన పెట్టి పాలన పై దృష్టి పెట్టండి. ఆరు నెలలైనా ఈ ప్రభుత్వం పాలన పై దృష్టి సాధించలేదు అనడానికి ఇది ప్రత్యేక నిదర్శనం. తమిళనాడు లో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి కాగానే జయలలిత గారి ఫోటో తో ఉన్న బుక్స్, బ్యాగ్ ను యధావిదంగా విద్యార్థులకు ఇచ్చి తమ హుందాతనాన్ని చాటుకున్నారు. పక్కా రాష్ట్రం సీఎం గారు, జగన్ రెడ్డి బొమ్మతో గల కిట్లను పంపిణీ చేయాలని, ప్రజాధనం వృధా చేయకండని ఆదేశించి ఎంతో హుందాగా వ్యవహరించారు. మరి మీ హుందాతనం ఎక్కడికి పోయింది?
Also Read
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
విద్యార్థులకు ఇచ్చిన బుక్స్ లో కేసీఆర్ గారి పేరు ఉంది అని బుక్స్ వెనక్కి తెప్పించడం పేజీలను చింపివేయడం, ఆ పేజీలపై మరో పేజీ అతికించడం సమంజసమా. ఈ అనాలోచిత చర్య వల్ల ప్రజాధనం వృధా కాదా ? చింపివేసిన పేజీల వెనకాల వందేమాతరం,జనగణమన గేయాలు ప్రతిజ్ఞలు ఉన్న పట్టింపు లేదా? కేసీఆర్ గారి మీద కోపం తో జాతీయ గీతాలని కూడా అవమానిస్తారా ?ఈ ప్రభుత్వానికి ఇది తగునా? ఈ సంవత్సరం బుక్స్ తో పాటు బ్యాగ్స్ ఇవ్వమని కేసీఆర్ గారి ఆదేశం తో విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది దానిని అమలు చేయమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించండి, పాలన మీద దృష్టి పెట్టమని ఈ ప్రభుత్వానికి నా చిన్న సలహా.’ అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!