Sabitha Indra Reddy : పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ పేరు ఉంటే తప్పేంటి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉంటే తప్పేమిటని తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ ఫొటో, గుర్తును తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె సూచించారు. ట్విట్టర్ వేదికగా.. ‘పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ పేరు ఉంటే తప్పేంటి? తాము పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు ఆలస్యంగా అందించే సంస్కృతికి ముగింపు పలికాం. ఆరునెలలు ముందు నుంచే ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లి పుస్తకాలు,యూనిఫారాలను విద్యార్థులకు పాఠ్య అందించే ప్రయత్నం చేశాం. తాము ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు రూ.108 కోట్లు వెచ్చించి రెండు జతల యూనిఫారాలు, రూ.200 కోట్లకు వెచ్చించి రూ.1.90 కోట్ల ఉచిత పుస్తకాలను ముద్రించి సకాలంలో ఇచ్చాం. ఇక రాష్ట్రంలో తొలిసారిగా ఏ ప్రభుత్వం చేయనట్లుగా రూ.34.70 కోట్లతో 11.27 లక్షల మందికి వర్కబుక్స్ రూ.56.24 కోట్లతో, రూ.12.30 కోట్లతో ఉచిత నోట్ బుక్స్ పంపిణీకి శ్రీకారం చుట్టాము. విద్యార్థులందరికీ తాము యూనిఫారాలు,పాఠ్యపుస్తకాలు సందర్భంగా గుర్తుచేశారు. జూన్ 12 అందచేశాము.’ అని పోస్ట్ చేశారు.
అంతేకాకుండా.. ‘ కేసీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి గుర్తులు తొలగించాలని ఆలోచనను పక్కన పెట్టి పాలన పై దృష్టి పెట్టండి. ఆరు నెలలైనా ఈ ప్రభుత్వం పాలన పై దృష్టి సాధించలేదు అనడానికి ఇది ప్రత్యేక నిదర్శనం. తమిళనాడు లో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి కాగానే జయలలిత గారి ఫోటో తో ఉన్న బుక్స్, బ్యాగ్ ను యధావిదంగా విద్యార్థులకు ఇచ్చి తమ హుందాతనాన్ని చాటుకున్నారు. పక్కా రాష్ట్రం సీఎం గారు, జగన్ రెడ్డి బొమ్మతో గల కిట్లను పంపిణీ చేయాలని, ప్రజాధనం వృధా చేయకండని ఆదేశించి ఎంతో హుందాగా వ్యవహరించారు. మరి మీ హుందాతనం ఎక్కడికి పోయింది?
Also Read
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
విద్యార్థులకు ఇచ్చిన బుక్స్ లో కేసీఆర్ గారి పేరు ఉంది అని బుక్స్ వెనక్కి తెప్పించడం పేజీలను చింపివేయడం, ఆ పేజీలపై మరో పేజీ అతికించడం సమంజసమా. ఈ అనాలోచిత చర్య వల్ల ప్రజాధనం వృధా కాదా ? చింపివేసిన పేజీల వెనకాల వందేమాతరం,జనగణమన గేయాలు ప్రతిజ్ఞలు ఉన్న పట్టింపు లేదా? కేసీఆర్ గారి మీద కోపం తో జాతీయ గీతాలని కూడా అవమానిస్తారా ?ఈ ప్రభుత్వానికి ఇది తగునా? ఈ సంవత్సరం బుక్స్ తో పాటు బ్యాగ్స్ ఇవ్వమని కేసీఆర్ గారి ఆదేశం తో విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది దానిని అమలు చేయమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించండి, పాలన మీద దృష్టి పెట్టమని ఈ ప్రభుత్వానికి నా చిన్న సలహా.’ అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!