NTV Telugu Site icon

Saba Karim: ధోనీ వచ్చాకే వికెట్ కీపర్లకు క్రేజ్ పెరిగింది

Saba

Saba

ఒకానొక సమయంలో ఇండియాకు వికెట్ కీపర్లు దొరకడం కష్టంగా ఉండేది. రాహుల్ ద్రావిడ్ తర్వాత సరైన వికెట్ కీపర్ కోసం కొన్నేళ్ల పాటు ఎన్నో ప్రయత్నాలు చేసింది టీమిండియా. అప్పట్లో పార్థివ్ పటేల్, అజయ్ రత్రా, దినేశ్ కార్తీక్, నమన్ ఓజా కీపింగ్, బ్యాటింగ్ లో సరైన ప్రదర్శన చూపించక.. ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే ఎప్పుడైతే ధోనీ ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి వికెట్ కీపర్లకు క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం టీమిండియాకి సీనియర్ మోస్ట్ దినేశ్ కార్తీక్‌, వృద్ధిమాన్ సాహాలతో పాటు రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, జితేశ్ శర్మ ఇలా అరడజను మంది ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితి రావడానికి ధోనీయే కారణం..

Tamannaah: ఆ సీన్లకి ఒప్పుకోకపోతే అక్కని, ఆంటీని చేసేవారు..తమన్నా ఏంటి ఇలా అనేసింది!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి బీసీసీఐ మాజీ సెలక్టర్, మాజీ వికెట్ కీపర్ సబా కరీం జియో సినిమా షోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘నేను మొదటిసారి ధోనీని చూసినప్పుడు అతను బీహార్ టీమ్ కు రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అతని దగ్గర బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌ స్కిల్స్‌ని దగ్గర్నుంచి గమనించా. తన బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయా. స్పిన్ బౌలింగ్‌ అయినా పేస్ బౌలింగ్‌లో అయినా అద్భుత షాట్లు ఆడుతున్నాడు. అని సబా కరీం తెలిపాడు.

MP Margani Bharat: రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నం

కెన్యాలో ఇండియా A, పాకిస్తాన్ A, కెన్యా మధ్య ట్రై సిరీస్ జరిగింది. దినేశ్ కార్తీక్ అప్పటికే టీమిండియాకి వికెట్ కీపర్‌గా ఉండడంతో ఇండియా A తరుపున ధోనీకి ఆడే ఛాన్స్ దక్కింది. ఆ సిరీస్‌లో అతని వికెట్ కీపింగ్ చాలా అద్భుతంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. చెప్పాల్సిన పనే లేదు, చితక్కొట్టేశాడు. ఆ సిరీస్‌లో అతను ఆడిన విధానం నాకు ఇంకా గుర్తుంది. అదే అతని కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకున్నా. వెంటనే కోల్‌కత్తాకి వెళ్లి కెప్టెన్ సౌరవ్ గంగూలీని కలిశానని సబా కరీం పేర్కొన్నాడు. టీమిండియా ఎలాంటి వికెట్ కీపర్ కోసమైతే చూస్తుందో, అలాంటి వికెట్ కీపర్‌ బీహార్‌కి ఆడుతున్నాడని చెప్పా. అప్పటికి సౌరవ్ గంగూలీ, ధోనీని చూడలేదు. అందుకే మాహీని పాకిస్తాన్‌ టూర్‌కి సెలక్ట్ చేయలేదు. ఆ తర్వాత ధోనీ ఆటను చూసి టీమ్‌కి సెలక్ట్ చేయమని చెప్పాడు…’ అంటూ సబా కరీం చెప్పుకొచ్చాడు.