Sajjanar: కండక్టర్ ను విధుల నుంచి అందుకే తొలంగించాం.. క్లారిటీ ఇచ్చిన సజ్జనార్
- మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా దురుసుగా ప్రవర్తించాడు..
- అందుకే కండక్టర్ శంకర్ ను విధులనుంచి తొలగించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjanar: జనగామ డిపోకు చెందిన ఓ కండక్టర్ విధులకు గైర్హాజరయ్యారనే ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ఈ నెల 1వ తేదీన హన్మకొండ నుంచి హైదరాబాద్కు జనగామ డిపోకు చెందిన బస్సులో ఓ మహిళ తన తల్లి, ఏడాది వయసున్న కొడుకుతో కలిసి ఎక్కింది. వీరంతా మొదటి వరుస మహిళా రిజర్వేషన్ సీట్లలో కూర్చున్నారు. ఆ సమయంలో కండక్టర్ శంకర్ ఆ సీట్లు ఖాళీ చేయాలని వారితో అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించాడు. లేదంటే బస్సు దిగి వెళ్లిపోవాలని చెప్పారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని చెప్పినా వినకుండా ముగ్గురు వ్యక్తులను మడికొండ వద్ద బస్సు నుంచి దింపారు. ఈ విషయాన్ని బాధిత మహిళా ప్రయాణికురాలి భర్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా TGSRTC యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వివరాలతో పాటు, బస్సు, డ్రైవర్ మరియు కండక్టర్ల ఫోటోలను కూడా పంచుకున్నారు. ఈ ఘటనపై యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు విచారణ చేపట్టారు.
Also Read
Read also: Naga Chaitanya: శోభితతో ముగిసిన నాగచైతన్య ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..?
దీంతో కండక్టర్ శంకర్ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించి నిబంధనలకు విరుద్ధంగా మార్గమధ్యలో బస్సు నుంచి దింపినట్లు తేలడంతో అతడిని విధుల నుంచి తొలగించారు. టీజీఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారం సదరు కంపెనీ కండక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంది. గతంలో కూడా శంకర్ పై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. ఫలితంగా రెండుసార్లు సస్పెండ్ కాగా, ఒకసారి తొలగించారు. అంతేకాదు అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మూడున్నరేళ్లుగా ఐదుసార్లు విధులకు గైర్హాజరయ్యాడు. శంకర్పై 12 ఫిర్యాదులున్నాయని సజ్జనార్ వెల్లడించారు. అయితే మానవతా దృక్పథంతోనే ఆ సంస్థ తనకు పోస్టింగ్ ఇచ్చిందని తెలిపారు. మళ్లీ ఫిర్యాదు అందడంతో విచారణ జరిపి గతంలో మాదిరిగానే శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. టీజీఎస్ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. సజ్జనార్ మాట్లాడుతూ 45 వేల మంది ఆర్టీసీ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నారని, ప్రతిరోజూ 55 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారని తెలిపారు.
Sunkishala: విరిగిపడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్.. త్రుటిలో తప్పిన ప్రమాదం..
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!