RSS Invites Congress: రేపటి నుంచి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు.. కాంగ్రెస్కు ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Invites Congress: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ ఏడాది విజయదశమి రోజున 100 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ అనేక శతాబ్ది ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆగస్టు 26 నుంచి 28 వరకు మూడు రోజుల ఉపన్యాసంతో శతాబ్ది సంవత్సర కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇక్కడో ప్రత్యేకత ఏమిటంటే ఆర్ఎస్ఎస్ వాళ్లు కాంగ్రెస్ పార్టీకి కార్యక్రామానికి రావాలని ఆహ్వానం పంపించారు.
READ ALSO: Visakhapatnam : గాజువాక లంకా మైదానంలో లక్ష చీరలతో భారీ గణనాథుడు
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు..
ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం సంఘ్ గురించి సవివరమైన సమాచారాన్ని సమాజానికి అందించడమని పలువురు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమంలో సర్ సంఘచాలక్ సంఘ్ స్వచ్ఛంద సేవకులు పాల్గొననున్నారు. ఇప్పటివరకు సంఘ్ ప్రయాణంతో పాటు, సమాజంలో సంఘ్ పట్ల వ్యాపించిన అపోహలను తొలగించడానికి ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటు ఇప్పటి వరకు సంఘ్కు దూరంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయని సమాచారం. అనేక దేశాల నుంచి దౌత్యవేత్తలను కూడా ఈ సెమినార్కు ఆహ్వానించారు. అలాగే క్రీడలు, కళలు, మీడియా, స్టార్టప్లు, న్యాయవ్యవస్థ, అధికారులు, దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, ఆలోచనాపరులు, ప్రభావశీలులు వంటి అనేక రంగాలకు చెందిన వ్యక్తులను ఆహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొనాలని దాదాపు 2000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆగస్టు 26న సంఘ యాత్ర 100 సంవత్సరాల నిర్వహణపై చర్చ ఉంటుంది. రెండవ రోజు భవిష్యత్తు దృక్కోణం నుంచి సంఘ్ అభిప్రాయాలపై చర్చ, మూడవ రోజు సంఘ్ చీఫ్తో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.
ఆర్ఎస్ఎస్ కానీ వాళ్లకు కూడా..
బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో సంబంధం లేకుండా పార్టీలో చేరిన నాయకులు కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్ బిట్టు, జ్యోతిరాదిత్య సింధియా, అప్నాదళ్ నాయకురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, జేడీయూకు చెందిన కెసి త్యాగి, సంజయ్ ఝా, టీడీపీ నుంచి కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు వంటి నాయకుల పేర్లు ఆర్ఎస్ఎస్ అతిథి జాబితాలో ఉన్నాయి. కార్యక్రమానికి కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ ఆర్ఎస్ఎస్ ఆహ్వానాలు పంపింది. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్తో సహా ప్రతి రాజకీయ పార్టీ నాయకులను మేము ఆహ్వానించామని ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ఒకరు తెలిపారు.
READ ALSO: Nuclear Tests in 80 Years: 80 ఏళ్లలో 2059 అణు బాంబులు బ్లాస్ట్.. ఇండియాలో ఎన్ని జరిగాయంటే?
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..