RSS Invites Congress: రేపటి నుంచి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు.. కాంగ్రెస్కు ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Invites Congress: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ ఏడాది విజయదశమి రోజున 100 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ అనేక శతాబ్ది ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆగస్టు 26 నుంచి 28 వరకు మూడు రోజుల ఉపన్యాసంతో శతాబ్ది సంవత్సర కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇక్కడో ప్రత్యేకత ఏమిటంటే ఆర్ఎస్ఎస్ వాళ్లు కాంగ్రెస్ పార్టీకి కార్యక్రామానికి రావాలని ఆహ్వానం పంపించారు.
READ ALSO: Visakhapatnam : గాజువాక లంకా మైదానంలో లక్ష చీరలతో భారీ గణనాథుడు
Also Read
ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు..
ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం సంఘ్ గురించి సవివరమైన సమాచారాన్ని సమాజానికి అందించడమని పలువురు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమంలో సర్ సంఘచాలక్ సంఘ్ స్వచ్ఛంద సేవకులు పాల్గొననున్నారు. ఇప్పటివరకు సంఘ్ ప్రయాణంతో పాటు, సమాజంలో సంఘ్ పట్ల వ్యాపించిన అపోహలను తొలగించడానికి ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటు ఇప్పటి వరకు సంఘ్కు దూరంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయని సమాచారం. అనేక దేశాల నుంచి దౌత్యవేత్తలను కూడా ఈ సెమినార్కు ఆహ్వానించారు. అలాగే క్రీడలు, కళలు, మీడియా, స్టార్టప్లు, న్యాయవ్యవస్థ, అధికారులు, దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, ఆలోచనాపరులు, ప్రభావశీలులు వంటి అనేక రంగాలకు చెందిన వ్యక్తులను ఆహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొనాలని దాదాపు 2000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆగస్టు 26న సంఘ యాత్ర 100 సంవత్సరాల నిర్వహణపై చర్చ ఉంటుంది. రెండవ రోజు భవిష్యత్తు దృక్కోణం నుంచి సంఘ్ అభిప్రాయాలపై చర్చ, మూడవ రోజు సంఘ్ చీఫ్తో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.
ఆర్ఎస్ఎస్ కానీ వాళ్లకు కూడా..
బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో సంబంధం లేకుండా పార్టీలో చేరిన నాయకులు కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్ బిట్టు, జ్యోతిరాదిత్య సింధియా, అప్నాదళ్ నాయకురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, జేడీయూకు చెందిన కెసి త్యాగి, సంజయ్ ఝా, టీడీపీ నుంచి కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు వంటి నాయకుల పేర్లు ఆర్ఎస్ఎస్ అతిథి జాబితాలో ఉన్నాయి. కార్యక్రమానికి కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ ఆర్ఎస్ఎస్ ఆహ్వానాలు పంపింది. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్తో సహా ప్రతి రాజకీయ పార్టీ నాయకులను మేము ఆహ్వానించామని ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ఒకరు తెలిపారు.
READ ALSO: Nuclear Tests in 80 Years: 80 ఏళ్లలో 2059 అణు బాంబులు బ్లాస్ట్.. ఇండియాలో ఎన్ని జరిగాయంటే?
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?