RSS Invites Congress: రేపటి నుంచి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు.. కాంగ్రెస్కు ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Invites Congress: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ ఏడాది విజయదశమి రోజున 100 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ అనేక శతాబ్ది ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆగస్టు 26 నుంచి 28 వరకు మూడు రోజుల ఉపన్యాసంతో శతాబ్ది సంవత్సర కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇక్కడో ప్రత్యేకత ఏమిటంటే ఆర్ఎస్ఎస్ వాళ్లు కాంగ్రెస్ పార్టీకి కార్యక్రామానికి రావాలని ఆహ్వానం పంపించారు.
READ ALSO: Visakhapatnam : గాజువాక లంకా మైదానంలో లక్ష చీరలతో భారీ గణనాథుడు
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు..
ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం సంఘ్ గురించి సవివరమైన సమాచారాన్ని సమాజానికి అందించడమని పలువురు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమంలో సర్ సంఘచాలక్ సంఘ్ స్వచ్ఛంద సేవకులు పాల్గొననున్నారు. ఇప్పటివరకు సంఘ్ ప్రయాణంతో పాటు, సమాజంలో సంఘ్ పట్ల వ్యాపించిన అపోహలను తొలగించడానికి ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటు ఇప్పటి వరకు సంఘ్కు దూరంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయని సమాచారం. అనేక దేశాల నుంచి దౌత్యవేత్తలను కూడా ఈ సెమినార్కు ఆహ్వానించారు. అలాగే క్రీడలు, కళలు, మీడియా, స్టార్టప్లు, న్యాయవ్యవస్థ, అధికారులు, దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, ఆలోచనాపరులు, ప్రభావశీలులు వంటి అనేక రంగాలకు చెందిన వ్యక్తులను ఆహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొనాలని దాదాపు 2000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆగస్టు 26న సంఘ యాత్ర 100 సంవత్సరాల నిర్వహణపై చర్చ ఉంటుంది. రెండవ రోజు భవిష్యత్తు దృక్కోణం నుంచి సంఘ్ అభిప్రాయాలపై చర్చ, మూడవ రోజు సంఘ్ చీఫ్తో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.
ఆర్ఎస్ఎస్ కానీ వాళ్లకు కూడా..
బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో సంబంధం లేకుండా పార్టీలో చేరిన నాయకులు కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్ బిట్టు, జ్యోతిరాదిత్య సింధియా, అప్నాదళ్ నాయకురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, జేడీయూకు చెందిన కెసి త్యాగి, సంజయ్ ఝా, టీడీపీ నుంచి కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు వంటి నాయకుల పేర్లు ఆర్ఎస్ఎస్ అతిథి జాబితాలో ఉన్నాయి. కార్యక్రమానికి కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ ఆర్ఎస్ఎస్ ఆహ్వానాలు పంపింది. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్తో సహా ప్రతి రాజకీయ పార్టీ నాయకులను మేము ఆహ్వానించామని ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ఒకరు తెలిపారు.
READ ALSO: Nuclear Tests in 80 Years: 80 ఏళ్లలో 2059 అణు బాంబులు బ్లాస్ట్.. ఇండియాలో ఎన్ని జరిగాయంటే?
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!