Mumbai: ఆఫిస్ కి ఆలస్యంగా వస్తే రూ.200 జరిమానా..ఐదు సార్లు పెనాల్టీ కట్టిన కంపెనీ వ్యవస్థాపకుడు
- ఉద్యోగులు 9.30 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని నియమం
- వారం రోజుల్లో అయిదు సార్లు లేట్ గా వచ్చిన వ్యవస్థాపకుడు
- తన అనుభవాన్ని ఎక్స్ లో పంచుకున్న సీఈవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైకి చెందిన బ్యూటీ స్టార్టప్ బ్రాండ్ వ్యవస్థాపకుడు శల్ షా ఇటీవల ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఉత్పాదకతను పెంపొందించేందుకు కఠినమైన నియమాన్ని ప్రవేశపెట్టారు. షా తన సిబ్బందిని ఉదయం 9.30 గంటలకు కార్యాలయానికి చేరుకోవడం తప్పనిసరి చేశారు. ఎవరైనా ఆలస్యంగా వస్తే.. రూ.200 జరిమానా విధించారు. దురదృష్టవశాత్తూ కొత్త నియమంతో ఆయనకే ఎదురుదెబ్బ తగిలింది. వారంలోపు కౌశల్ కార్యాలయానికి అయిదు సార్లు ఆలస్యంగా వచ్చారు. దీంతో నియమం పెట్టిన వ్యక్తే రూ. 1,000 చెల్లించాల్సి వచ్చింది.
READ MORE: Mushrooms Benefits : పుట్టగొడుగులను మహిళలు ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
ఎవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా , సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ “ఎక్స్”లో తాను చెల్లించిన నగదుకు సంబంధించి స్ర్కీన్ షార్టు పోస్టు చేశారు. “కార్యాలయంలో ఉత్పాదకతను పెంచడానికి.. ప్రతి ఒక్కరూ ఉదయం 9:30 గంటలకు ఆఫీసులో ఉండాలని నేను కఠినమైన నియమం పెట్టాను. ఇంతకుముందు మేము 10-11 గంటలకు వచ్చేవాళ్లం. ఆలస్యంగా వచ్చిన వాళ్లు రూ. 200 జరిమానాగా చెల్లిస్తారు. ఇది నేను 5వ సారి చెల్లిస్తున్నాను.” అని రాసుకొచ్చారు. కాగా చాలా మంది నెటిజన్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఆ ఖాతా ఎవరిదని వ్యాఖ్యానించారు. జరిమానాలను వసూలు చేయడానికి తాను ప్రత్యేక UPI లైట్ ఖాతాను సృష్టించినట్లు షా తెలిపారు. జరిమానా ద్వారా వచ్చిన డబ్బును పూర్తిగా జట్టు కార్యకలాపాలు, డైనింగ్, ఇతర టీమ్ ఈవెంట్ల వంటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు వ్యవస్థాపకుడు పేర్కొన్నారు.
Last week,
To increase the productivity in office,
I made a strict rule for everyone to be in the office by 9:30 am (earlier we used to come by 10-11)
and if we‘re late, we pay Rs.200 as penalty.
This is me paying it for the 5th time🫠 pic.twitter.com/4qYi6kTP17
— Kaushal (@_kaushalshah) June 19, 2024
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..